ప్రతిపక్ష హోదాను కాపాడుకోవడం తెలుసంటున్న చంద్రబాబు..!

ఆరేడుగురు ఎమ్మెల్యేల్ని లాగేసుకుని… చంద్రబాబు ప్రతిపక్ష హోదాను.. క్యాన్సిల్ చేయాలని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే .. ఒక వికెట్ వల్లభనేని వంశీ రూపంలో డౌన్ అయింది. మరో వికెట్ గంటా శ్రీనివాసరావు రూపంలో.. రెడీగా ఉంది. అయితే.. ఈయన బీజేపీ వైపు చూస్తున్నారు. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మరో ఐదుగురిపై.. వైసీపీ గురి పెట్టి.. వ్యాపారాలు.. అవసరాలను… లెక్క తీస్తోందని… వారు కూడా లైన్లోకి వస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో… చంద్రబాబునాయుడు.. మీడియా ప్రతినిధుల ముందు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనుకుంటున్నారని..అది వారి భ్రమ.. అని తేల్చి చెప్పారు. ఒక్క ఎమ్మెల్యేను బెదిరించి .. పార్టీలో చేర్చుకున్నంత మాత్రాన.. ఆందోళన చెందడానికి ఏముందంటున్నారు. ఇల్లు అలకగానే పండగకాదని.. ..వీరు హోదా ఇస్తేనే వచ్చిందా…అని ప్రశ్నించారు. ప్రజలు ఇస్తేనే వచ్చిందన్నారు. ప్రజలు ఇచ్చిన హోదాను కాపాడుకోవడం నాకు తెలీదా.. అని మీడియా ప్రతినిధుల్ని ప్రశ్నించారు. వాస్తవానికి ప్రతిపక్ష నేత.. అనే గుర్తింపు అసెంబ్లీ రికార్డుల్లో మాత్రమే ఉంటుంది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారంతా ప్రతిపక్ష నేతలే. ప్రధాన ప్రతిపక్ష నేతకు.. అసెంబ్లీలో గుర్తింపు ఉంటుంది. అసెంబ్లీలో టీడీపీ తప్ప మరో పార్టీ లేదు కాబట్టి.. ఎంత మంది ఎమ్మెల్యేలున్నా.. ప్రతిపక్ష హోదా ఉంటుంది.

అయితే.. చంద్రబాబు.. తాను పధ్నాలుగేళ్లు సీఎంగా చేశానని.. పదేళ్లు ప్రతిపక్ష నేతగా పని చేశానని.. తన రాజకీయ జీవితంలో… అయితే… సీఎం..లేకపోతే ప్రతిపక్ష నేతగానే ఎక్కువ కాలం ఉన్నానని.. తనకు ఇంక రాజకీయ పదవులపై ఆశ ఏముంటుందని ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ మాటలే వైసీపీ పెద్దలకు రుచించడం లేదు. ఆయనకు ప్రతిపక్ష హోదాను దూరం చేయాలన్న పట్టుదలతో ఉన్నారంటున్నారు. దాన్ని ఎలా కాపాడుకోవాలో.. తనకు తెలుసని.. చంద్రబాబు అంటున్నారు. మొత్తానికి.. ఏపీ రాజకీయాల్లో ఇలా కొత్త రేస్ ప్రారంభమయిందని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close