తన పై మార్ఫింగ్ ట్వీట్, ‘వైకాపా పేటీఎం బ్యాచ్’ పనే అంటూ విరుచుకుపడ్డ లోకేష్

నారా లోకేష్ మీద వచ్చినన్ని మార్ఫింగ్ ట్వీట్ లు ఈ మధ్యకాలంలో మరెవరి మీద వచ్చి ఉండవేమో. నారా లోకేష్ ని ఒక తెలివితక్కువ వ్యక్తిగా చిత్రీకరించడానికి ఆయన అకౌంట్ ని పోలిన విధంగా నకిలీ అకౌంట్ సృష్టించి, తాను ట్వీట్ చేసినట్టుగా కొన్ని అసంబద్ధమైన ట్వీట్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా లోకేష్ ను పూర్తిగా రాజకీయాలకు పనికి రాకుండా చేయాలని ఒక వ్యూహం ప్రకారం ఈ ప్రచారం సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే తాజాగా తన పేరు మీద చేసిన ఇలాంటి ఒక ఫేక్ ట్విట్ మీద విరుచుకుపడ్డారు నారా లోకేష్.

నిన్న ఎయిడ్స్ డే సందర్భంగా, లోకేష్ ట్వీట్ చేసినట్లుగా ఒక ఫేక్ ట్వీట్ కొందరు పనిగట్టుకుని సృష్టించారు. ” ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న నా సోదర సోదరీమణులకు ఎయిడ్స్ డే శుభాకాంక్షలు. మీకు తెలుగు దేశం అండగా ఉంటుంది” అని రాసిన ఆ ట్వీట్ ను నారా లోకేష్ అకౌంట్ ని పోలిన నకిలీ అకౌంట్ నుండి ట్వీట్ చేశారు. అయితే ఇది నకిలీ అకౌంట్ అని తెలియని పలువురు, ‘ఎయిడ్స్ డే కి శుభాకాంక్షలు చెబుతున్నానంటే నువ్వు నిజంగా పప్పు’, ‘ఎయిడ్స్ డే కి ఎవరైనా శుభాకాంక్షలు చెబుతారా తింగరి వాడి లాగా ఉన్నావు’ – ఇలా స్పందించారు.

అయితే ఇలా ఒక పథకం ప్రకారం, తన మీద జరుగుతున్న కుటిల యత్నాలను ట్విట్టర్ వేదికగా ఖండించారు లోకేష్. ఆయన ట్వీట్ చేస్తూ, “ఎయిడ్స్ రోగం కంటే పెద్ద జబ్బు వైకాపా సైకో సిండ్రోమ్. జగన్ గారు పేటీఎమ్ లో వేసే ఐదు రూపాయిల భిక్షం కోసం ఎంత నీచమైన పనులు అయినా చేస్తారు. జగన్ గారు చేతగాని వాడు అని ఆరు నెలల్లోనే తేలిపోవడంతో మళ్లీ వైకాపా సైకో బ్యాచ్ కి పనిపెట్టారు. నన్ను బదనాం చెయ్యడం కోసం ఏమీ దొరకకపోవడంతో నా పేరుతో ఫేక్ మార్ఫింగ్ పోస్టులు పెట్టించి జగన్ గారు శునకానందం పొందుతున్నారు ” అని రాసుకొచ్చారు.

మరి లోకేష్ పేర్కొన్న ఆ పేటీఎం బ్యాచ్ లోకేష్ ట్వీట్ పై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close