దిశ నిందితుల‌ ఎన్ కౌంట‌ర్ మీద న‌లువైపులా విచార‌ణ‌!

దిశ కేసులో నిందితుల ఎన్ కౌంట‌ర్ త‌రువాత ఒకేసారి నాలుగువైపుల నుంచి ద‌ర్యాప్తులు, కోర్టులో విచార‌ణ‌లు చ‌క‌చ‌కా కొన‌సాగుతున్నాయి. రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్) ఒక‌వైపు ద‌ర్యాప్తు ప్రారంభించింది. జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సి.) కూడా ఈ ఎన్ కౌంట‌ర్ పై మూడో రోజు విచార‌ణ‌ను కొన‌సాగించింది. ఇదే రోజున హైకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ల‌ను కూడా విచార‌ణ‌కు స్వీక‌రించింది. సుప్రీం కోర్టులో దాఖ‌లైన పిటీష‌న్ల‌పై విచార‌ణ జ‌రిగింది.

ఇవాళ్ల హైకోర్టు విచార‌ణ‌లో… నిందితుల మృత‌దేహాల‌ను గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించాల‌నీ, శుక్ర‌వారం వ‌ర‌కూ భ‌ద్ర‌ప‌ర‌చాల‌ని ఆదేశించింది. ఎన్ కౌంట‌ర్ పై దాఖ‌లైన పిటిష‌న్ల‌నూ కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఎన్ కౌంట‌ర్ విష‌యంలో గ‌తంలో సుప్రీం కోర్టు చెప్పిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తు.చ‌. త‌ప్ప‌కుండా పాటించారా లేదా అనీ, స్థానిక పోలీసులు కేసు న‌మోదు చేశారా అని అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ ని కోర్టు అడిగింది. దీంతో ఏజీ స్పందిస్తూ మార్గ‌ద‌ర్శకాల‌ను పాటించార‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్.ఐ.ఆర్. కాపీని స‌మ‌ర్పించాల‌ని కోర్టు అడిగింది. త‌దుప‌రి విచార‌ణ‌ను గురువారానికి వాయిదా వేసింది. ఓవైపున బుధ‌వారం నాడు సుప్రీం కోర్టులో ఇదే కేసుపై విచార‌ణ ఉంది కాబ‌ట్టి, గురువారం వ‌ర‌కూ వాయిదా కోరారు ఏజీ. దీంతో కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది.

సాధార‌ణంగా, ఏదైనా ఒక కేసు లోయ‌ర్ కోర్టులో విచార‌ణ జ‌రుగుతుంటే… పైకోర్టులు అదే అంశ‌మై విచార‌ణ‌ను స్వీక‌రించ‌వు. కింది కోర్టులో పూర్త‌య్యాకే చూస్తామంటాయి. కానీ, దిశ నిందితుల ఎన్ కౌంట‌ర్ కేసులో ఒకేసారి హైకోర్టు, సుప్రీం కోర్టులు స్పందించ‌డం కొంత ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భమే. ఇవాళ్ల సుప్రీం కోర్టులో కూడా ఇదే కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. ఇది హైకోర్టులో ఉంది కాబట్టి, అక్క‌డే విచార‌ణ పూర్తి చేయాల‌నే ప్ర‌స్థావ‌న అక్క‌డ వ‌చ్చిన‌ప్పుడు అడ్వొకేట్ స్పందిస్తూ… సుప్రీం కోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పోలీసులు ఫాలో కాలేద‌న్న అనుమానాలున్నాయన్నారు. కాబ‌ట్టి, వాద‌న‌లు వినాల‌ని కోరారు. బుధ‌వారం సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. చ‌ర్చంతా సుప్రీం కోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పోలీసులు పాటించారా లేదా అనేదే ప్ర‌ముఖంగా వినిపిస్తోంది కాబ‌ట్టి, దీనిపై ముందుగా ఒక స్ప‌ష్ట‌త సుప్రీం కోర్టులో వ‌స్తే… ఆ త‌రువాత‌, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు విచార‌ణ దానికి కొన‌సాగింపుగా ఉంటుందా లేదా అనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close