టీటీడీకి స్వరూపానంద తర్వాతే శ్రీవారు..!

దేవదేవుని దర్శనం కోసం… అమెరికా నుంచి బయలుదేరినా… గోవిందుని నామస్మరణమే చేస్తారు. కానీ.. శ్రీవారి సేవలో ఉండేవారు మాత్రం..ఆ శ్రీవారిని తప్ప… ప్రభుత్వ పెద్దలకు ఇష్టమైన వారందరి నామస్మరణ చేస్తూంటారు. టీటీడీ అధికారులు. ఉద్యోగులు.. శ్రీవారి కన్నా… స్వరూపానందకే ప్రాధాన్యం ఇస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన స్వరూపానందేంద్రకు… టీటీడీ అధికారులు నేరుగా అలిపిరి వద్దకు వెళ్లి స్వాగతం పలికేశారు. ఇప్పటి వరకూ ఏ పీఠాధిపతికి కానీ.. ముఖ్యమంత్రికి కానీ.. గవర్నర్‌కు కానీ…రాష్ట్రపతికి కానీ.. చివరికి ప్రధానమంత్రికి కూడా అలిపిరి వద్దకు వెళ్లి స్వాగతం పలికిన సందర్భం లేదు.

అంతే కాదు.. స్వరూపానందను స్వాగతం చెప్పిన పద్దతి కూడా.. శ్రీవారిని కించపరిచేలా ఉంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో ధనుర్మాసం లో జరిగే తిరుప్పావై ఉత్సవాల సందర్భంగా మూల విరాట్ కు శంఖం ఎడమచేతి వద్ద ప్రతిరోజు గోదాదేవి జ్ఞాపకార్థంగా అలంకరించే పవిత్ర ఆకులతో తయారు చేసిన ధనుర్మాస చిలకను తిరుమల ఆలయం నుంచి అలిపిరి వద్దకు తీసుకొచ్చి స్వరూపానందకు ఇచ్చారు. ఇది ఆలయ నిబంధనలకు విరుద్ధం. శ్రీ వారికి అలంకారం చేసిన పూలమాలలను బయటకు ఇవ్వకూడదు. వీటిని తీసుకొచ్చి.. స్వరూపానందకు వేశారు. ఇవన్నీ తీవ్ర విమర్శల పాలవుతూండగా.. కొత్తగా శ్రీవారి నిధులు కూడా.. శారదా పీఠానికి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
   
జనవరి 3వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు విశాఖ శారదా పీఠంలో హిందూ ధర్మపరిరక్షణ జాతీయ మహాసభలు నిర్వహించాలని స్వరూపానంద నిర్ణయించారు. దీనికి నిధులు కేటాయించాలని… స్వరూపానంద ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం.. బాగా ఆదాయం ఉన్న ఆలయాలకు సాయం చేసే అవకాశాలు పరిశీలించాలని లేఖ రాశారు. ఇందులో తిరుమల కూడా ఉంది. మంజూరు చేయడం… మాత్రమే మిగిలిందని.. స్వరూపానందకు ప్రభుత్వంలో ఉన్న ప్రాధాన్యత చూస్తే తెలిసిపోతుందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పేర్ని నాని – ఇంకా వైసీపీ ఓడిపోలేదుగా !?

మాచర్లలో ఎంతో మంది హత్యకు గురి కావడానికి... మరెన్నో హత్యా ప్రయత్నాల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని రాష్ట్రమంతా గగ్గోలు పెడుతూంటే వైసీపీ కొత్త సిద్దాంతంతో తెరపైకి...

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close