ఏప్రిల్ నెలలో వరంగల్, ఖమ్మం మునిసిపల్ ఎన్నికలు?

గ్రేటర్ ఎన్నికలలో తిరుగలేని విజయం సాధించిన తరువాత ఇప్పుడు తెరాస ప్రభుత్వం గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. ఇప్పటికే డివిజన్లు, వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేసారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించగానే ఎన్నికల తేదీలు ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు కార్పోరేషన్లతో బాటు మహబూబ్ నగర్ జిల్లాలో అచ్చంపేట మునిసిపాలిటీకి కూడా ఎన్నికలు నిర్వహించవచ్చును. వచ్చే ఈనెల మొదటివారం నుండి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. బహుశః అవి రెండు-మూడు వారాలపాటు కొనసాగే అవకాశం ఉంటుంది. కనుక అవి పూర్తయిన వెంటనే ఎన్నికల తేదీలు ఖరారు చేయవచ్చును. ఇంతవరకు జరుగుతున్న వివిధ ఎన్నికలలో తెరాస పార్టీ వరుసగా విజయం సాధిస్తూ వస్తోంది కనుక ఈ మూడు మునిసిపల్ ఎన్నికలలో కూడా అవలీలగా విజయం సాధించవచ్చును.

ఒకప్పుడు వరంగల్, ఖమ్మం జిల్లాలు తెదేపాకు కంచు కోటలుగా ఉండేవి కానీ ఖమ్మం నుండి తుమ్మల నాగేశ్వర రావు, వరంగల్ నుండి కడియం శ్రీహరి వంటి ముఖ్యనేతలు పార్టీని వీడి తెరాసలో చేరిపోవడంతో ఆ కంచుకోట పునాదులు కదిలిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి బలమయిన నేతలు, వారికి పెద్ద క్యాడర్ కూడా ఉన్నప్పటికీ వారు కూడా తెరాస ధాటిని ఎదురునిలిచి పోరాడలేక చేతులు ఎత్తేస్తున్నారు. ఇక బీజేపీ శక్తి సామర్ధ్యాలు ఏపాటివో వరంగల్ ఉపఎన్నికలలో మళ్ళీ గ్రేటర్ ఎన్నికలలో తేలిపోయింది కనుక ఆ రెండు జిల్లాల మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికలలో అది కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోవచ్చును.

వరుస అపజయాలతో, పార్టీ నేతల వలసలతో ప్రతిపక్షాలు పూర్తిగా డీలాపడి ఉన్న ఈ సమయంలోనే ఎన్నికలు జరిపించేస్తే తెరాస అవలీలగా విజయం సాధించవచ్చును. విజయం సాధిస్తే ప్రతిపక్షాల ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిని ఇక తిరిగి కోలుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చును. కనుక వీలయినంత త్వరగానే ఈ ఎన్నికలు జరిపించవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close