ఏపీలో స్థానిక ఎన్నికలు..! పార్టీలు రెడీనా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది నెలల కిందటే జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు.. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలలు ఆలస్యంగా జరగబోతున్నాయి. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను..ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలను.. నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికలు నిర్వహించి తీరాలని ప్రభుత్వాన్ని పలుమార్లు హైకోర్టు హెచ్చరించడంతో.. ఎట్టకేలకు హైకోర్టుకు.. షెడ్యూల్‌ను అందజేశారు దీని ప్రకారం ల 17న స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 10న ఫలితాలు వస్తాయి. 15లోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి అవుతుంది. ఈ లోపే ఫిబ్రవరి 8న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 3నాటికి ఎన్నికలు పూర్తి అవుతాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు పెట్టనున్నారు.

అయితే.. రిజర్వేషన్ల అంశం మాత్రం.. ఇంకా అస్పష్టంగానే ఉంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం.. 50 శాతం రిజర్వేషన్లకు మించరాదు. కానీ ఏపీ సర్కార్ 60 శాతం రిజర్వేషన్లను ఖరారు చేసింది. దీనిపై ఎవరైనా కోర్టులో పిటిషన్ వేస్తే.. కోర్టు ఇచ్చే రూలింగ్‌ను బట్టి… మిగతా ప్రక్రియ ఉండే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలను ఆలస్యం చేయాలన్న ఉద్దేశంతోనే.. గతంలో తెలంగాణ అనుభవాలు తెలిసి కూడా.. ఏపీ సర్కార్ ఆరవై శాతం రిజర్వేషన్లు ఖరారు చేసిందనే అభిప్రాయం వ్యక్తమయింది.

మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు.. సిద్ధమవలేదు. పాలన కుదటపడకపోవడంతో.. అధికార పార్టీ టెన్షన్ పడుతోంది. అనేక రకాల సమస్యలు.. ప్రభుత్వాన్ని వెల్లువెత్తాయి. కొన్ని వారు సృష్టించుకోగా.. మరికొన్ని.. అనూహ్యంగా వచ్చి పడ్డాయి. దీంతో.. అన్ని వర్గాల ప్రజలూ.. ఇక్కట్లు పడుతున్నారు. అయితే.. స్థానిక ఎన్నికలు పూర్తిగా గ్రామ రాజకీయాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి.. రాష్ట్ర స్థాయి అంశాలు.. ప్రభావం చూపవని అధికార పార్టీ నమ్ముతోంది. ఘోరపరాజయభారంతో ఉన్న టీడీపీ.. అధికార పార్టీని ఎదుర్కోవడానికి కసరత్తులు చేస్తోంది. మెజార్టీ స్థానాల్లో గెలిచి ప్రజావ్యతిరేకత బలంగా ఉందని నిరూపించాలనుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close