డీజీపీ చెప్పిన నిరసనల హక్కు విపక్ష పార్టీలకు లేదా..?

అమరావతి పర్యటనలో ఓ రోజు చంద్రబాబు వెళ్లారు. కొంత మంది రాళ్లు, చెప్పులు వేశారు. ఈ ఘటన జరిగిన అరగంటలోనే.. డీజీపీ గౌతం సవాంగ్ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని.. వారు అదే చేశారని.. గొప్పగా చెప్పుకొచ్చారు. ఆ మాటలే ఇప్పుడు.. రోజుకు వంద సార్లు.. డీజీపీ సవాంగ్‌కు గుర్తు చేస్తున్నారు రాజధాని రైతులు.. ఇతర పార్టీల నేతలు. చంద్రబాబుపై రాళ్లు, చెప్పులు వేయడానికి అనుమతించే నిరసనలు.. తాము ప్రజాస్వామ్య బద్దంగా చేసుకుంటామంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. చెప్పులు, రాళ్లు వేయడాన్ని నేరం కాదని.. నిరసనగా చెప్పిన డీజీపీ… అదే తమ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ.. మహిళలు… పిల్లల్ని.. వేధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

అమరావతి ఉద్యమంలో ప్రతీ రోజూ.. వందల మందిపై కేసులు పెడుతున్నారు. రహదారి దిగ్భంధం విషయంలో ఏడు వందల మందిపై కేసులు పెట్టారు. అమరావతి జేఏసీ నేత అనిపించుకున్న ప్రతి ఒక్కర్ని.. పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఓ కేసు పెడుతున్నారు. అమరావతి గ్రామాల్లో ఎక్కడా నిరసనకు అవకాశం ఇవ్వడం లేదు. టెంట్లు కూడా వేయనివ్వడం లేదు. చివరికి బస్సుయాత్రకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ నిలివేశారు. ఉద్యమిస్తున్న మహిళలపై… కూడా పోలీసులు అరాచకానికి పాల్పడుతున్నారు.

ప్రభుత్వానికే పోలీసులు … ప్రజలకు పోలీసులు కాదన్నట్లుగా… డీజీపీ తీరు ఉండటం.. ఇతర పార్టీలు.. ప్రజాసంఘాల నేతల్ని ఆగ్రహానికి గురి చేస్తోంది. నిరసనల విషయంలో గతంలో డీజీపీ చేసిన వ్యాఖ్యల్ని.. వారు తమ ఫోన్లలో పోలీసుల ముందు ప్రదర్శిస్తున్నారు. తమ నిరసనలకు అడ్డు రావొద్దని కోరుతున్నారు. ఈ విషయం లో డీజీపీ కూడా.. పరిస్థితుల్ని సమర్థించుకోలేని పరిస్థితి ఉంది. గౌతం సవాంగ్ .. గతంలో సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ఆయన చర్యలు మాత్రం వివాదాస్పదమవుతున్నాయి. ప్రభుత్వం చెప్పినట్లు చేయడం తన విధి అని ఆయన తనను సమర్థించుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close