ఏపీ అభివృద్ధి మాటల్లోనే .. ఖర్చులో లేదు..!

ఓ రాష్ట్ర అభివృద్ధిని దేనితో లెక్కిస్తారు..? జీడీపీ పెరిగితేనే.. ఆదాయం పెరిగినట్లు అవుతుంది. జీడీపీ పెరగాలంటే… అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి.. ప్రజల ఆదాయం పెరిగేలా చేయాలి. అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టకపోతే.. రాష్ట్రం అధోగతి పాలయినట్లే. ఏ ప్రభుత్వమైన రెండు రకాల ఖర్చులను బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఒకటి అభివృద్ధి… మరొకటి సంక్షేమం . సంక్షేమం అనేది ప్రజలకు నేరుగా లబ్దిచేకూరుస్తుంది. అభివృద్ధి.. ఆదాయాన్ని పెంచుతుంది. ఉదాహరణకు..ఓ ప్రాజెక్ట్ మీద.. ప్రభుత్వం… రూ. పదివేల కోట్లు ఖర్చు పెడుతుందనుకుందాం. ఆ ప్రాజెక్ట్ వల్ల పదివేల ఎకరాలు సాగులోకి వస్తే.. ఆ మేరకు ప్రజలకు ఆదాయం పెరుగుతుంది. అంటే… రాష్ట్ర ఆదాయం పెరిగినట్లే. అదే జీడీపీ.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ జీడీపీని పెంచుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గత ఎనిమిది నెలల కాలంలో … అభివృద్ధి కార్యక్రమాలపై పెట్టిన ఖర్చు రూ. నాలుగు వేల కోట్లకు అటూ ఇటూగానే ఉంది. ఇది బడ్జెట్‌లో .. రెండు, మూడు శాతం కూడా లేదు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన అన్ని రకాల పనులను.. ఎనిమిది నెలల కిందట నిలిపివేశారు. చివరికి పోలవరం ప్రాజెక్ట్ పనులు కూడా నిలిపివేశారు. ఇప్పుడు చాలా మందకొడిగా పనులు జరుగుతున్నాయి. ఓ హౌసింగ్ ప్రాజెక్టులో జరుగుతున్నట్లుగా కూడా జరగడం లేదు. ఇతర ప్రాజెక్టులు… ఇళ్ల నిర్మాణం అన్నీ నిలిచిపోయాయి. అన్నింటికీ రివర్స్ టెండర్లేశారు. కానీ ఎవరూ పనులు ప్రారంభించ లేదు.

నిజానికి ప్రభుత్వం చేసే ఖర్చుతోనే..ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ కదలిక ఉంటుంది. ఎంత ఎక్కువ ప్రభుత్వం పనులు చేపడితే.. అంతగా.. నగదు చెలామణి ఉంటుంది. ఎనిమిది నెలల కిందట.. పోలవరం, అమరావతి ప్రాంతాల్లో మాత్రమే కాదు.. ఏపీ వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు, ఇతర ప్రాజెక్టులు శరవేగంగా నిర్మితమయ్యేవి. ఓ అంచనా ప్రకారం… ఇలా పెట్టే ఖర్చులో 20 శాతానికిపైగా వివిధ పన్నుల రూపంలో మళ్లీ ప్రభుత్వానికే చేరుతుంది. ఇప్పుడు అన్నీ ఆగిపోవడంతో… ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది. ప్రజలకూ మేలు జరగడంలేదు. జీడీపీ కూడా పడిపోయింది. మొత్తానికి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితికి వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close