బీజేపీ-జనసేన పొత్తులపై టీడీపీ సైలెంట్..!

భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులపై స్పందించాల్సిన అవసరమే లేదని.. తెలుగుదేశం పార్టీ ఓ నిర్ణయానికి వచ్చింది. ఓ వైపు అధికార పార్టీ.. ఆ పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్‌పై మండి పడుతూంటే.. టీడీపీ మాత్రం తేలిగ్గా తీసుకుంది. ఇప్పటికిప్పుడు స్పందిచాల్సిన అవసరం లేదని.. పూర్తిగా రాజధాని ఉద్యమంపై దృష్టి కేంద్రీకరించాలని.. హైకమాండ్ పార్టీ నేతలకు స్పష్టమైన సందేశం పంపింది. పవన్ కల్యాణ్.. బీజేపీతో కలవడం .. అదీ ఈ సమయంలో కలవడం వెనుక ఖచ్చితంగా రాజకీయం ఉందని.. అది .. వైసీపీకే ఎక్కున నష్టం చేస్తుందన్న అభిప్రాయంతో.. టీడీపీ నేతలు ఉన్నారు.

జగన్ కేసులనూ..ఇంత కాలం కేంద్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందని.. ఇక ముందు.. అలా చూడకుండా.. ఒత్తిడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్ చాలా పటిష్టంగా ఉందని.. ఆ రెండు పార్టీల పొత్తుల వల్ల.. తమ క్యాడర్ ఎవరూ ఆకర్షితులయ్యే అవకాశం లేదని అంచనాకొచ్చారు. రాజధాని ఉద్యమం విషయంలో.. ప్రజల్లో.. ఓ స్పష్టత వచ్చిందని… జగన్మోహన్ రెడ్డి.. గతంలో అంగీకరించి.. ఇప్పుడు.. కారణాలు లేకుండా.. రాజధాని తరలింపు ప్రయత్నాలు చేయడం వెనుక కుట్ర ఉందని ప్రజలు నమ్ముతున్నారని టీడీపీ భావిస్తోంది.

ఇలాంటి సమయంలో.. బీజేపీ, పవన్ కల్యాణ్‌ పొత్తులకు లేనిపోని ప్రాధాన్యత ఇచ్చి విమర్శలు చేయడం ద్వారా.. ఉద్యమం పక్కదారి పడితే.. రైతులకు అన్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. అయితే.. టీడీపీలోని కొన్ని వర్గాలు మాత్రం.. వచ్చే ఎన్నికల నాటికి.. విపక్ష పార్టీలన్నీ.. ఏకతాటిపైకి రావాల్సిన పరిస్థితులు వస్తే.. ఆయా పార్టీలు… టీడీపీ దగ్గరకు రావాల్సిందేనని.. గుర్తు చేస్తున్నారు. టీడీపీ వైపు నుంచి మాత్రం… ఎలాంటి చొరవ ఉండదని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close