కేంద్రం చేతుల్లో లేదంటే నమ్మేస్తారా జనం..!?

భారతీయ జనతా పార్టీ నేతలు ప్రజల దృష్టిలో ఇమేజ్ పెంచుకునే అవకాశం.. రాజధాని విషయంలో వచ్చింది. ప్రజాభిప్రాయం మేరకు.. బీజేపీ రాష్ట్ర శాఖ కూడా తమ నిర్ణయాన్ని తీర్మానంగా చేసింది. విశాఖ బీజేపీ నేతలు.. ఉత్తరాంధ్ర బీజేపీ క్యాడర్ కూడా.. అమరావతి రాజధానిని సమర్థించాయి. అంటే… రాష్ట్రం మొత్తం.. రాజధాని తరలింపు అంశాన్ని వ్యతిరేకిస్తున్నాయని అర్థం. ఇలాంటి సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ చేయాల్సింది.. రాష్ట్రంలో పార్టీలు కాదు.. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి.. అమరావతి విషయంలో అడుగు ముందుకు వేయకుండా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవడం. అలాంటి చర్యలు తీసుకున్నప్పుడే.. బీజేపీపై ప్రజల్లో నమ్మకం కలుగుతుంది.

ఎందుకంటే.. ఇప్పటికే.. కేంద్ర పెద్దలకు చెప్పే.. అమరావతిని మారుస్తున్నామన్న ప్రచారాన్ని వైసీపీ నేతలు గుట్టుగా చేసేస్తున్నారు. వారి పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ చెబుతున్నారు. అందుకే.. ఇంత గందరగోళం జరుగుతున్నా… సాక్షాత్తూ ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని తరలించేందుకు నిర్ణయించినా.. మాట్లాడటం లేదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తమ నిర్ణయాన్ని ఖరారు చేసుకున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీల మాదిరిగా పోరాటం చేస్తాం.. రైతులకు అండగా ఉంటామని.. మాటలు చెబితే నమ్మే పరిస్థితి లేదు. కేంద్రం తల్చుకుంటే.. ఏం చేయగలదో… అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే చూపించారు.

కేసుల లగేజీ ఉన్న.. జగన్ విషయంలో… కేంద్రం కనుసైగ చాలు. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర శాఖ అభిప్రాయాన్ని.. కేంద్ర బీజేపీ పరిగణనలోకి తీసుకోకపోతే.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయకపోతే.. బీజేపీ డబుల్ గేమ్ అడినట్లుగా ప్రజల్లోకి వెళ్లిపోతుంది. అదే జరిగితే.. పవన్ కల్యాణ్‌తో పొత్తు వల్ల కూడా ఒరిగేదేముండదన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

‘పూరీ’ తమ్ముడికి ఓటమి భయం?

విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం 'హార్ట్' లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్...

మదర్స్ డే @ 200 సంవత్సరాలు

ప్రతి ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారని మనకు తెలుసు.. అయితే ఈ ప్రతిపాదన మొదలై 200 సంవత్సరాలు అయిందనే విషయం మీకు తెలుసా? వాస్తవానికి 'మదర్స్ డే వేడుకలు'...

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close