అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం జగన్ నిరీక్షణ..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ అడిగి రెండు వారాలు దాటిపోయింది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి విజయసాయిరెడ్డి ఈ విషయంలో..ఫుల్టైం పని చేస్తున్నారు.తన పలుకుబడిని ఉపయోగించి.. అమిత షా అపాయింట్‌మెంట్ తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని తరలింపు విషయంపై కేంద్రానికి ఓ మాట చెప్పాలనుకుంటున్నారన్న ప్రచారం.. మూడు వారాలుగా సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున జగన్ ప్రకటన చేసిన తర్వాత… జీఎన్ రావు కమిటి రిపోర్ట్ ను..కేబినెట్‌లో ఆమోదించి..విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించి.. విశాఖకు వెళ్లాలనుకున్నప్పుడే… ఆయనకు అవాంతరాలు ఎదురయ్యాయి.

జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ ను నేరుగా.. కేబినెట్‌లో ఆమోదించలేక… బోస్టన్ గ్రూప్ పేరు చెప్పి..తర్వాత ఆయన విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించడానికి విశాఖ వెళ్లారు. అప్పట్నుంచి.. ఏదో ఓ నివేదిక పేరు చెప్పి.. సమయం గడిచిపోతోంది కానీ.. ఇంకా అధికారిక నిర్ణయం ప్రకటించలేదు. కానీ..అప్పట్నుంచి.. జగన్మోహన్ రెడ్డి.. అమిత్ షా.. సమయం కోసంచూస్తున్నారు. కానీ దొరకడం లేదంటున్నారు. ఇరవయ్యో తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టదల్చుకున్న విషయాన్ని బహిరంగంగా చెప్పిన తర్వాతకూడా.. జగన్ కుఢిల్లీ నుంచి పిలుపు అందలేదు. ఈ కారణంగానే… వాయిదాలు వేస్తున్నారా.. అన్న సందేహాలు కూడా వస్తున్నాయంటున్నారు. తాము తీసుకునే అన్ని నిర్ణయాలను.. కేంద్రానికి చెప్పే చేస్తున్నామని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.

నిజంగా చెబుతున్నారో లేదో కానీ… పీపీఏలు, పోలవరం వంటి అంశాల్లో… నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్ర పెద్దల్ని విజయసాయి, బీజేపీ నేతలు కలిశారు. దీంతో కేంద్రానికి చెప్పారని అనుకున్నారు. దీంతో కేంద్రంపైనే విమర్శలొచ్చాయి. ఇప్పుడు అమిత్ షాను కలిసిన తర్వాత జగన్.. అమరావతిని తరలిస్తే…తాను కేంద్రానికి చెప్పే చేశానని జగన్ ప్రచారం చేసుకుంటారేమోనని.. బీజేపీ పెద్దలు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని.. బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. మరి ఏది నిజమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close