తెదేపా, కాంగ్రెస్‌.. కలిసి ఎదుర్కొంటే సరి!

”శత్రువుకు శత్రువు.. మిత్రుడు” అనే పురాతనమైన సిద్ధాంతం ఇంతకూ ఇప్పుడు పనిచేస్తుందా లేదా?

”ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగింది. గ్రేటర్‌ ఎన్నికల్లో మోసం చేసి గెలిచారు. నారాయణఖేడ్‌లో బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి” అనే ఆరోపణలు మరియు డిమాండ్‌లలో సారూప్యత ఉన్నప్పుడు.. అదే డిమాండ్‌తో ప్రొసీడ్‌ అయ్యే పార్టీలు కలిసికట్టుగా పోరాడవచ్చు కదా?

లాంటి సందేహాలు ఇప్పుడు జనానికి కలుగుతున్నాయి. అవును మరి.. తెరాసను నిందిస్తూ తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ ఒకే రకమైన ఫిర్యాదులు, డిమాండ్లతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య ఇంత భావసారూప్యత ఉన్నప్పుడు.. కలిసే తెరాస మీద పోరాడవచ్చు కదా? విడివిడిగా చేసే పోరాటం కంటె.. కలసికట్టుగా కలబడితే లాభం ఉంటుందికదా అనే సలహాలు కూడా వినిపిస్తున్నాయి.

గ్రేటర్‌ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరిగ్‌కు పాల్పడడం ద్వారా తెరాస సాంకేతిక అరాచకత్వానికి పాల్పడిందంటూ విపక్షాలు రెండూ ఆరోపణలకు దిగాయి. ఈవీఎంల్లో గ్రేటర్‌ ఎన్నికల్లో ‘నోటా’ బటన్‌ను తొలగించడం మీద కూడా అనేక ఆరోపణలు గుప్పించారు. తెరాస ముందే చెప్పుకున్నట్లుగా కచ్చితంగా వంద గెలవడం అనుమానంగా ఉన్నదని వారనడం హాస్యాస్పదమైన సంగతి. నిజానికి గతంలో చంద్రబాబు హయాంలో ఈవీఎంలు మొదలైన రోజుల్లో అసలే హైటెక్‌ బాబుగా పేరున్న చంద్రబాబు ఏదో తిమ్మిని బమ్మిని చేసేస్తారంటూ అనేక పుకార్లు వచ్చాయి. పలుసందర్భాల్లో నాయకులు అనుమానాలు వ్యక్తంచేసి… మెషిన్లను పరీక్షించారు. ప్రతిసారీ వారి అనుమానాలు తుస్సుమన్నాయి. ఇప్పుడు అదే ఆరోపణలతో రెండు పార్టీలూ ఎన్నికల సంఘం వద్దకు ధ్వజమెత్తుతున్నాయి.

తెరాసను ఎదుర్కొనడంలో ఇంతగా.. భావసారూప్యతతో పోరాడుతున్న ఈ రెండు పార్టీలో కలిసే తలపడితే పోదా? అని పలువురు అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన విపక్షాలన్నీ కలిసి ఒకే డిమాండ్‌తో వస్తే గనుక.. ఎన్నికల సంఘం లోనూ కాస్త చలనం రావొచ్చు. వీరికి ఒకవైపు అలాంటి సలహాలు వస్తోంటే.. మరోవైపు తెరాస అభిమానులు మాత్రం.. ”అవును , రాబోయే ఎన్నికల్లో కూడా తెదేపా, కాంగ్రెస్‌, భాజపా అందరూ కలిసి ఒకే అభ్యర్థిని పోటీకి దింపి తెెరాసను ఎదుర్కొంటేనే బెటర్‌.. అప్పుడు వారికి కనీసం డిపాజిట్‌ అయినా దక్కుతుందేమో” అని సెటైర్లు వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close