సోమవారం మండలి రద్దు తీర్మానం..!?

సోమవారం శాసనమండలి రద్దు తీర్మానాన్ని .. ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసే అవకాశం కనిపిస్తోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిన నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్న అధికార పార్టీ.. మండలి అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చింది. అసెంబ్లీలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్సీ మంత్రులు అయిన మోపిదేవి, పిల్లి సుభాష్ కూడా.. మండలి అవసరం లేదన్నారు. చివరికి.. జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. అప్పుడే.. శాసనమండలిని రద్దు చేస్తూ.. తీర్మానం చేస్తారని అనుకున్నారు. కానీ.. సోమవారం మరింతగా చర్చించి.. నిర్ణయం తీసుకుందామని వాయిదా వేశారు. తీర్మానం చేయడానికి ముందు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి..అందు కోసం వాయిదా వేశారని భావిస్తున్నారు. అలా కాదు.. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా.. ఒత్తిడి చేయడానికే.. ఇలా చేశారన్న మరో వాదన కూడా వినిపిస్తోంది.

మూడు రాజధానుల బిల్లుపై.. ముందుకెళ్లాలంటే… మండలిని రద్దు చేయడం తప్ప.. మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడింది. అధికార వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటికీ పంపడంతో.. ఆ బిల్లులు ఇక పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. సెలెక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లులను.. శాసనమండలి.. ఎప్పుడు తిరిగి పంపిస్తుందన్నదానిపైనా క్లారిటీ లేదు. సెలక్ట్ కమిటీ ప్రక్రియ ప్రారంభమైతే.. కనీసం మూడు నెలలు పడుతుంది. ఆ తర్వాత ఎంత సమయం తీసుకుంటారన్నదానిపై ఆంక్షలు లేవు. యనమల రామకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం.. ఎంత కాలం అయినా బిల్లు తిప్పి పంపకుండా… సెలక్ట్ కమిటీ అభిప్రాయాలు సేకరింవచ్చు. రాష్ట్రం మొత్తం ప్రజాభిప్రాయాలు తీసుకోవచ్చని.. యనమల చెప్పడంతో.. ఆ బిల్లు అంత సామాన్యంగా తిరిగి రాదని వైసీపీ నేతలకూ ఓ క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇరుక్కుపోయిన … అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులకు విముక్తి కల్పించాలంటే ప్రభుత్వం ముందున్న ఒకే ఒక్క మార్గంమని… అధికార పార్టీ నేతలు నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. రాజధాని విషయంలో ప్రభుత్వం అన్ని వైపుల నుంచి కార్నర్ అయిపోయిందని స్పష్టం అయిపోయింది. మండలిని ఉన్నపళంగా రద్దు చేస్తే తప్ప.. ఇక రాజధాని నిర్ణయాన్ని కదిలించడం అసాధ్యం. మండలిని రద్దు చేయాలంటే.. ఏడాది పడుతుందని చెబుతున్నారు. తీర్మానం చేయడం వరకే రాష్ట్ర ప్రభుత్వ పరిధి. ఉభయసభలు ఆమోదించాలి. రాష్ట్రపతి సంతకం పెట్టాలి. కానీ కేంద్రంతో మాట్లాడి.. బడ్జెట్ సమావేశాల్లోనే .. మండలి రద్దును ఉభయసభల్లో ఆమోదింపచేస్తే.. త్వరగానే అయిపోతుందని వైసీపీ వ్యూహకర్తలు అంచనాకు వచ్చారు. అలా కాదు.. మండలిని రద్దు చేస్తామన్న హెచ్చరికలతో.. మళ్లీ మండలి దారికి వచ్చి.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే.. ప్రభుత్వం పునరాలోచించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close