తుగ్లక్ కాదు జగ్లక్ అంటున్న సీపీఐ రామకృష్ణ..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు… చరిత్రలో తుగ్లక్ అనే చక్రవర్తి తీసుకుంటున్న నిర్ణయాల్లానే ఉన్నాయని చెబుతూ.. కొద్ది రోజులుగా.. ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు.. కమ్యూనిస్టు పార్టీల నేతలు.. మరింత ముందుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తుగ్లక్ కన్నా మించిపోయాయని.. ఆయనను జగ్లక్ అని పేరు పెట్టడం మంచిదని అంటున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ… జగన్ తుగ్లక్ కాదని.. జగ్లక్ అని తేల్చి చెప్పారు. ఆయన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని.. ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలో రాజధానులు అనేదే లేకపోతే.. ఇడుపులపాయ నుంచే పరిపాలించాలని.. రామకృష్ణ జగన్‌కు సలహా ఇచ్చారు.

మూడు రాజధానులు, మండలి రద్దు సహా ప్రతి నిర్ణయం ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తను చెప్పినట్లుగా వినలేదని మండలిని రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఏపీ పేద రాష్ట్రం అయితే.. ఒక్క లాయర్‌కు ఐదు కోట్లు చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు. ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేక పాలన అందిస్తున్నప్పటికీ.. కేబినెట్‌లోని మంత్రులు ఎందుకు నోరు తెరవడం లేదని.. రామకృష్ణ ఆశ్చర్యపోయారు. వైఎస్ కేబినెట్‌లో ఉన్న సీనియర్లు ఆయనకే సలహాలు ఇచ్చారని.. ఇప్పుడు మాత్రం.. నోరు తెరవడం లేదన్నారు. ఇప్పటికైనా సీనియర్ మంత్రులు నోరు తెరవాలని.. సీపీఐ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

సొంత పార్టీలో ఎవరినీ నోరెత్తకుండా చేసిన.. జగన్మోహన్ రెడ్డి.. విపక్ష పార్టీల నేతల విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు లెక్కలోకి తీసుకోవడం లేదు. ప్రజాందోళనలను సైతం.. ఓ వర్గానికి.. ఓ పార్టీకి చెందినవిగా భావించి లైట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో.. విపక్షాలు మరింత పట్టుదలగా విమర్శలు చేస్తున్నాయి… కానీ వెనక్కి తగ్గడం లేదు. జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించడానికి వెనుకాడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close