తెలంగాణ ప్రభుత్వఖాతానుంచి రు.95 లక్షలు దోచేసిన నైజీరియన్లు

హైదరాబాద్:  నైజీరియన్ల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సాధారణ పౌరులనే ఇప్పటివరకు బుట్టలో పడేసి డబ్బులు దోచేసే నైజీరియన్లు తాజాగా ఏకంగా ప్రభుత్వఖాతానే హ్యాక్ చేసి రు.95 లక్షలు కొల్లగొట్టిన ఘటన వెలుగులోకొచ్చింది. తెలంగాణ మీ-సేవ సర్వీసుల డిప్యూటీ డైరెక్టర్ మధుసూదనరెడ్డి ఈ-మెయిల్‌ను హ్యాక్ చేశారు. మీసేవ నిధులు డిపాజిట్ చేసిఉన్న యాక్సిస్ బ్యాంకుకు మధుసూదనరెడ్డి పంపినట్లుగా 4 మెయిల్స్ పంపి, ఫలానా ఖాతాలలో రు.1.54 కోట్లను జమ చేయాల్సిందిగా కోరారు. బ్యాంక్ అధికారులు అదేవిధంగా ఆ మొత్తాలను జమ చేశారు. గంటల వ్యవధిలోనే ఆ నిధులను నైజీరియన్లు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఒక బ్యాంక్‍‌కు చెందిన అధికారులకు అనుమానం వచ్చి రు.30 లక్షలు నిలిపేశారు. మరో బ్యాంక్ అధికారులు హైదరాబాద్‌‍లోని యాక్సిస్ బ్యాంకుకు ఫోన్ చేసి రు.29 లక్షల చెల్లింపులు చెల్లింపులు ఆపాల్సిందిగా అభ్యర్థించటంతో ఆ మొత్తాన్ని ఆపేశారు. అయితే నైజీరియన్లు అప్పటికే రు.95 లక్షలు విత్‌డ్రా చేసేశారు. వీరి ఖాతాలు ఉత్తరప్రదేశ్, ఢిల్లీలలో ఉన్నట్లు తర్వాత తెలిసింది. వీరిని పట్టుకోవటానికి సైబర్ క్రైమ్ ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్ళారు.

మరోవైపు, నైజీరియన్లు ఇటీవల పెళ్ళిసంబంధాల వెబ్‌సైట్లలోకుకూడా దూరి మోసాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లండన్ సిటిజన్, డాక్టర్, ఎన్ఆర్ఐలుగా పరిచయం చేసుకుని హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులకు చెందిన యువతులను మోసం చేసి రు.77 లక్షలు దోచుకున్న వైనం నిన్న బయటపడింది. ఈ మోసానికి పాల్పడిన ఇద్దరు నైజీరియన్లు, ఒక నాగాల్యాండ్ యువతిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close