చిరు 150వ సినిమా దర్శకుడిపై రాంచరణ్ నర్మగర్భ వ్యాఖ్యలు: పూరి డౌటే!

హైదరాబాద్: చిరంజీవి 150వ చిత్రంనుంచి దర్శకుడు పూరి జగన్నాథ్ తప్పుకుంటున్నారని, వినాయక్‌కు ఆ ప్రాజెక్టు అప్పగిస్తున్నారని ఇటీవల మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రాంచరణ్ ఇవాళ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. పూరిని దర్శకుడిగా తీసుకున్నట్లు తాను చెప్పినమాట నిజమేనని అన్నారు. పూరి చెప్పిన కథలో ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ కూడా కుదిరితే ప్రాజెక్ట్ ముందుకెళుతుందని అన్నారు. ఈ విషయంలో నిర్ణయం చిరంజీవే తీసుకుంటారని, కథ ముఖ్యమని, మంచికథ ఎవరు తీసుకొస్తే వారితో ప్రారంభిస్తామని అన్నారు. పూరి కథతో చేస్తే ఆ చిత్రం పేరు ఆటో జానీ అవుతుందని చెప్పారు. పూరి ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమాతో బిజీగా ఉన్నారని, దానిగురించి తానేమీ మాట్లాడబోనని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుపై వినాయక్‌కూడా ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ నిర్మాణంలో తాను హీరోగా నటించే చిత్రం వచ్చే ఏడాది ప్రధమార్థంలో ప్రారంభమవుతుందని తెలిపారు. గబ్బర్ సింగ్ చిత్రం పూర్తయిన తర్వాత ఆ చిత్రం ఉంటుందని చెప్పారు. బాహుబలి చిత్రాన్ని ఇంకా తాను చూడలేదని, చూడాలని తెలిపారు. రాంచరణ్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న టర్బోమేఘ ఎయిర్‌లైన్స్‌ సంస్థ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో చరణ్ ఇవాళ ఈ విషయాలను వెల్లడించారు. ఎయిర్‌లైన్స్‌కు అనుమతులు అన్నీ వచ్చేశాయని, ఈనెల 12నుంచి ట్రూజెట్ విమాన సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తామని, పుష్కరాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతామని చెప్పారు. సీనియర్ సిటిజన్స్‌కు, దక్షిణాది సినీ పరిశ్రమ, ‘మా’ సభ్యులకు టికెట్లలో 10 శాతం రాయితీ ఇస్తామని తెలిపారు. వచ్చే మూడేళ్ళలో సంస్థ విస్తరణ చేపడతామని చరణ్ చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close