పాపం పీకే..! రాజకీయంలో బలి పశువు..!

పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్. రాజకీయ వ్యూహాల్లో దిట్ట. ఆయన సేవలు బీజేపీ నుంచి వైసీపీ వరకూ అందరూ ఉపయోగించున్నారు. ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు కూడా. కానీ ఆయనకు మాత్రం.. రాజకీయం చేత కావడం లేదు. బీహార్‌ రాజకీయ వారసుడు అయిపోదామని.. జేడీయూలో చేరిపోయిన ఆయన.. ఇప్పుడు.. ఆ పార్టీలో ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. ఉంటే ఉండు .. పోతే పో.. అని జేడీయూ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుంచి … వార్నింగ్‌లు అందుకుంటున్నాడు. దీనికి కారణం.. ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ వంటి అంశాల్లో.. మోడీ సర్కార్‌పై.. అమిత్ షాపై.. పీకే.. ఏకపక్షంగా విమర్శలు చేయడమే. ఆయన విమర్శలతో తనకేమీ సంబంధం లేదని.. నితీష్ నిరూపించుకోవడానికి.. పీకేని వదిలించుకోవడానికి కూడా సిద్ధమయ్యారు.

ఒకప్పుడు.. జేడీయూ – ఆర్జేడీ మధ్య పొత్తు పెట్టి.. సంచలన విజయం దక్కేలా చేసిన ఆయనపై.. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు మంచి గురి ఉంది. సహజంగా రాజకీయాల్లో వారసత్వాలను ఇష్టపడని నితీష్ కుమార్.. తన కుటుంబసభ్యులకు జేడీయూలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ.. ప్రశాంత్ కిషోర్‌ను మాత్రం… పార్టీలోకి తీసుకుని.. వైస్ ప్రెసిటెండ్‌గా పదవి ఇచ్చి.. తన తర్వాత ఇక ప్రశాంత్ కిషోరో అని పార్టీ శ్రేణులుకు సందేశం పంపారు. అయితే.. ఇప్పుడు.. పీకేతో అంత అవసరం లేదని అనుకున్నారో.. ఆయన రాజకీయ వ్యూహాలు ముంచేస్తాయని భావించారో కానీ వద్దనుకుంటున్నారు. అమిత్ షా కూడా వ్యూహాత్మకంగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమారే ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ముందుగానే ప్రకటించేస్తున్నారు. ఈ కారణంగా.. పీకే అవసరం.. నితీష్‌కు లేకుండా పోయినట్లయింది.

ప్రశాంత్ కిషోర్ .. ఈ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేసి.. తెలుగుదేశం పార్టీపై.. సోషల్ మీడియా ప్రచారం ద్వారా కుల ముద్ర వేసి.. మిగతా అన్ని కులాలను రెచ్చగొట్టడంలో ఆయన చాలా అతి తెలివి ప్రణాళికలు వేశారని.. ఆ కారణంగానే టీడీపీ ఓడిపోయిందని ఆ పార్టీ నేతలు అంటూంటారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలతోనే .. పీకే వ్యూహాలు నడుస్తాయన్న విషయం అందరికీ క్లారిటీ ఉంది. కానీ అది ఎల్ల కాలం పని చేయదని.. బీహార్ సీఎంకు తెలిసిపోయినట్లుగా ఉంది. ఇంక అవసరం లేదని గెంటివేతకు సిద్ధమయ్యారన్న చర్చ నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close