రాజధాని గ్రామాలకు పవన్.. ! బీజేపీ ట్రాప్ అర్థమైందా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్… హఠాత్తుగా ప్లాన్ మార్చారు. తాను రాజధాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు స్పష్టమైన సమాచారం పంపారు. షెడ్యూల్ ఖరారు చేయాలని ఆదేశించారు. బీజేపీతో కలిసి.. ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాలనుకున్న పవన్ కల్యాణ్‌కు.. బీజేపీ వైపు నుంచి.. కుంటి సాకులు ఎదురొచ్చాయి. పార్లమెంట్ సమావేశాలని… అగ్రనేతలు అందుబాటులో ఉండరని… కేంద్రమంత్రులు రారని.. ఇలాంటి సాకులతో.. రెండో తేదీన నిర్వహించాలనుకున్న కవాతును వాయిదా వేశారు. ఆ తర్వాత అయినా… బీజేపీ నుంచి .. అమరావతి ఉమ్మడి కార్యాచరణ విషయంలో సానుకూలత వస్తుందన్న నమ్మకం పవన్ కల్యాణ్‌కు లేకుండా పోయినట్లుగా తెలుస్తోంది.

అదే సమయంలో.. బీజేపీని నమ్ముకుని తాను సైలెంట్ గా ఉంటే.. తన క్రెడిబులిటి కూడా దెబ్బ తింటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే.. ఆయన బీజేపీతో కాకపోయినా.. తాను ఒంటరిగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పొత్తు ఒప్పందాల ప్రకారం… రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ సిద్దం చేసుకోవాలి. సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి ఉమ్మడిగా ముందుకెళ్లాలి. పవన్ పోరాట ఉత్సాహంలో ఉన్నారు కానీ… బీజేపీ మాత్రం మాటల్లోనే ఆ ఉత్సాహం చూపిస్తోంది. పొత్తు పెట్టుకున్న తర్వాత.. పవన్ ను సైతం .. స్లో చేసే ప్రయత్నాలు బీజేపీ వైపు నుంచి జరిగాయి. ఆయన కార్యాచరణకు తమ అనుమతి కావాలన్నట్లుగా మాట్లాడటం ప్రారంభించారు.

పవన్ ఆలోచనలకు గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు . ఢిల్లీ ఆమోదం కావాలని … సంకేతాలు ఇస్తూండటంతో… ప్రజల్లోకి తప్పుడు భావనలు వెళ్తాయన్న ఆందోళన పవన్‌ లో పెరిగిందంటున్నారు. రాజధాని రైతులకు సంఘిభావం తెలియచేయాలని ఆయన కొద్ది రోజులుగా అనుకుంటున్నారు. ఇప్పుడు.. ఆ పని చేయాలనుకుంటున్నారు. బీజేపీ నేతలు వచ్చినా రాకపోయినా… తాను మాత్రం… రాజధాని గ్రామాలకు త్వరలో వెళ్లనున్నారు. అంటే.. బీజేపీ ట్రాప్‌ను… పవన్ దాదాపుగా అర్థం చేసుకున్నారన్న అభిప్రాయం… జనసేన వర్గాల్లో ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటును రూ. 5వేలకు అమ్ముకున్న మంగళగిరి ఎస్‌ఐ

మంగళగిరి ఎస్ఐను సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకో.. వైసీపీ లీడర్‌కు కొమ్ము కాసినందుకో కాదు.. తన ఓటును ఐదు వేలకు అమ్ముకున్నందుకు. ఆధారాలతో సహా దొరికిపోవడంతో...

జగన్‌కు ప్రశాంత్ కిషోర్ పంచ్

ఓడిపోతామని ఎ రాజకీయ నాయకుడు చెప్పడు.. చివరికి నాలుగు రౌండ్లు కౌంటింగ్ పూర్తయ్యే వరకూ కూడా తమ ఓటమిని అంగీకరించరు అని.. స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ జగన్ మోహన్ రెడ్డి...

ఈసీపై కుట్ర – అల్లర్ల వెనుక అసలు కోణం !

ఏపీలో పోలింగ్ అనంతరం కొన్ని చోట్ల ఉద్దేశపూర్వక దాడులు జరగడం వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర ఉన్నదన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. ఎన్నికల కమిషన్ నిందించడానికి, అధికారుల బదిలీలను తప్పు పట్టడానికి ఈ కుట్రను...

ఈ టాస్క్ లో కేటీఆర్ ఓడుతారా..? నెగ్గుతారా ..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విషమ పరీక్ష ఎదురుకాబోతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉప ఎన్నిక ఇంచార్జ్ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారు. సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ ను గెలిపించుకోవడం కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close