ప్రధానిని కలిసిన 24 గంటలలోపే… పని ప్రారంభం..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏకాంతంగా సమావేశమయ్యారు. ఇద్దరూ గంటో, గంటన్నరో చర్చలు జరిపారు. ఆ ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయో తెలీదు కానీ ఆ భేటీ జరిగిన 24 గంటల లోపే ఆదాయ పన్ను శాఖ తన పని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల తాము జరిపిన ఆదాయ పన్ను దాడులపై ఓ ప్రకటన విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యక్తిగత కార్యదర్శితో సహా పలువురు తెలుగుదేశం నాయకుల కార్యాలయాల పైనా, ఇళ్లపైనా దాడులు చేసినట్లుగా ఐటీ శాఖ ప్రకటించింది. చట్టం తన పని తాను చేస్తుందని దేశ, రాష్ట్ర అధినేతలు పైకి చెప్పినా.. చట్టం వెనుక అధికార చుట్టం ఉంటుందని ఐటీ శాఖ ప్రకటనతో వెల్లడ్యయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పైనా, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని పేరు తెచ్చుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐటీ శాఖ చర్యతో దానిని నిజం చేసినట్లుగానే కన్పిస్తోందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. తాము ఎవరిపై దాడులు చేసామో ఐటీ శాఖ పేర్లు వెల్లడించకపోయినా ఎవరెవరిపై దాడులు జరిగాయో ప్రపంచానికి తెలిసిపోయింది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఒక్కటై పోయారనే వార్తలు వస్తున్నాయి. తమకు మద్దతు ఇవ్వాలని,తమ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించిన్నట్లుగానే కనిపిస్తోంది. ఈ పరస్పర అంగీకార నేపథ్యమే ఐటీ శాఖ చేసిన దాడుల ప్రకటనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే నిజమైతే తెలుగుదేశం పార్టీ అధినేతకు కష్టాలు ప్రారంభం అయినట్లేనని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close