నమస్తే ట్రంప్…! ప్రవాస భారతీయుల ఓట్లపై గురి..!

భారతదేశం… వందల కోట్లు ఖర్చు పెట్టి.. డొనాల్డ్ ట్రంప్‌ కోసం ఎన్నికల ప్రచారం చేస్తోంది. కాస్త అతిశయోక్తిగా ఉన్న ఇది మాత్రం నిజం. ట్రంప్ వస్తూ.. ఇండియాలకు ఎలాంటి తాయిలాలూ తీసుకు రావడం లేదు. కానీ పట్టుకుపోవడానికి మాత్రం చాలా పెద్ద లిస్ట్ తెచ్చారు. వాటి సంగతి పక్కన పెడితే.. మొత్తంగా.. ట్రంప్ ఇండియాలో చేయబోయేది పూర్తిగా ఎన్నికల ప్రచారం. అమెరికాలో ఓటు హక్కు ఉన్న ప్రవాస భారతీయుల ఓట్లను.. గుంపగుత్తగా తాను సొంతం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఈ ఏడాది చివరిలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రెండో సారి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఆయన విధానాల వల్ల.. వలసదారుల్లో వ్యతిరేకత ఉంది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నంలోనే ట్రంప్ ఇండియా టూర్‌ను వాడుకుంటున్నారు.

అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే ప్రకారం..అమెరికా జనాభాలో ఓటు హక్కు ఉన్న భారతీయులు 40 లక్షల మంది ఉన్నారు.  16 రాష్ట్రాల్లో ఒక శాతం కంటే ఎక్కువగా ప్రవాస భారతీయులు ఉన్నారు. పోటాపోటీగా జరిగే ఎన్నికల్లో.. ఒక్క శాతం.. ఫలితాల్ని తారుమారు చేస్తూ ఉంటుంది. గతంలో.. పలుమార్లు ఓట్లు ఎక్కువ వచ్చినప్పటికీ.. అమెరికా అధ్యక్ష అభ్యర్థి ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఎలక్టోరల్ సిస్టమే దీనికి కారణం. అందుకే ట్రంప్ ఏ అవకాశాన్ని వదిలి పెట్టదల్చుకోలేదు. ప్రవాస భారతీయులు ఎక్కువగా డెమెక్రాట్లకు మద్దతుగా నిలుస్తారు. డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందినవారు. ఆయనకు గత ఎన్నికల్లో 29 శాతం ప్రవాస భారతీయులే మద్దతుగా నిలిచినట్లుగా అక్కడి సర్వేలుతెలిపాయి. పెన్సిల్వేనియా, మిషిగాన్‌, విస్కాన్‌సిన్‌, ఫ్లోరిడాలలో  2016 ఎన్నికల్లో ట్రంప్‌ ఒక్కో రాష్ట్రంలో 10-11 వేల మధ్య ఆధిక్యం సాధించారు. ఈ లెక్కలు తారుమారైతే తుది ఫలితాలు ప్రభావితం అవుతాయి.

అందుకే ప్రవాస భారతీయుల ఓట్లను గురి పెట్టి.. ఇండియా పర్యటనకు వస్తున్నారు. గుజరాతీయులు అత్యధికం కావడంతో.. అహ్మదాబాద్‌లో మెయిన్ షెడ్యూల్ పెట్టుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా.. ట్రంప్ మళ్లీ గెలవాలని కోరుకుంటున్నారు. ఇందు కోసం.. అమెరికా వెళ్లినప్పుడు.. హౌడీ మోడీ అనే కార్యక్రమం నిర్వహించారు. దానికి ట్రంప్‌ను ఆహ్వానించారు. వేదికపై నుంచి… ఆప్‌ కీ బార్.. ట్రంప్ సర్కార్ అనే నినాదం ఇచ్చారు. అయితే ట్రంప్ విధానాలతో వలసదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రోజుకో కొత్త నిబంధన తెస్తూండటంతో.. మోడీ ప్రచారం చేసినా… ట్రంప్‌కు మద్దతిస్తారా అన్నది ఆసక్తికరమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఓ సారి రోడ్ల వైపు చూడండి!

ఏదైనా ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు ఉండాలి. అంటే రోడ్లు, కరెంట్, నీరు వంటివి. ఏపీలో రూ. 43 వేల కోట్లతో రోడ్లేశామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా...

రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు..ప్రజలకు వైద్య ఆరోగ్యశాఖ సూచనలివే

తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం , సాయంత్రం అనే తేడా లేకుండా భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. మే నెల ప్రారంభమైన మొదటి రోజే భానుడు...

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా జగన్ రెడ్డి..!?

తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే వైసీపీ కూడా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే..ఏపీలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను జగన్ రెడ్డి ప్రజల్లోకి...

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close