గుంటూరు అర్బన్ ఎస్పీపై సీబీఐ విచారణ..! హైకోర్టు సంచలన తీర్పు..!

గుంటూరు అర్బన్ ఎస్పీపై పీహెచ్‌డీ రామకృష్ణపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ.. హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇటీవలి కాలంలో పోలీసులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆరోపణల్లో.. అత్యధికం… కొంత మందిని.. తీసుకెళ్లిపోయి… హింసిస్తున్నారనేదే. ఇతర పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు.. అధికార పార్టీ నేతల ఫిర్యాదుల మేరకు.. కొంత మందిని టార్గెట్ చేసి మరీ.. తీసుకెళ్తున్నారని.. వివాదం అయిన తర్వాత అరెస్ట్ చూపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి కేసులోనే… అర్బన్ ఎస్పీ తీరుపై.. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. కొద్ది రోజుల కిందట… గుంటూరులో ముగ్గురు యువకుల అదృశ్యమయ్యారు. వారిని పోలీసులే తీసుకెళ్లారు. వాళ్లంతా ఇంట్లో ఉన్నప్పుడే మఫ్టీలో ఉన్న పోలీసులు దాడి చేసి తీసుకెళ్లారు. కానీ అరెస్ట్ చూపించలేదు.

15 రోజులైనా పోలీసులు ఏమీ చెప్పకపోవడంతో.. హైకోర్టులో హెబియస్ కార్పస్‌ పిటిషన్ వేశారు కుటుంబస్బయులు. ఆ తర్వాత పోలీసులు వారిపై.. క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొన్నారని కేసులు నమోదు చేశారు. ముగ్గురు యువకుల్ని చేబ్రోలు పోలీస్ స్టేషన్‌లో ఉంచి చిత్ర హింసలు పెడుతున్నారని కోర్టు దృష్టి తీసుకెళ్లడంతో … బైరోప్చు జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. పోలీసుల విచారణ నివేదిక.. జ్యూడియల్ నివేదిక కూడా తేడాగా ఉండటంతో… నిజాలను రాబట్టేందుకు సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. న్యాయవిచారణకు పోలీసులు సరిగా స్పందించకపోవడంతో సీబీఐ ఆదేశించిది.

కొద్ది రోజుల క్రితం.. డీజీపీ సవాంగ్ కూడా.. హైకోర్టు ఎదుట హాజరయ్యారు. అది కూడా.. ఈ తరహా కేసే. ఓ టీడీపీ మాజీ మంత్రి మనవడ్ని పోలీసులు అక్రమంగా తీసుకెళ్లారు. వారు కూడా హేబియస్ కార్పస్ పిటిషన్ వేయడం.. పోలీసులు చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని.. జ్యూడిషియన్ విచారణలో తేలడంతో.. డీజీపీని కోర్టుకు పిలిపించింది హైకోర్టు. అయినప్పటికీ.. అలాంటి కేసులోనే.. మరోసారి పోలీసులు హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. సీబీఐ విచారణతో.. ఏపీ పోలీసు వర్గాల్లో అలజడి ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close