బండెళ్లిపోతోంది..! బీజేపీ, జనసేన ఉమ్మడి పోరాటం ఎప్పుడు..?

అమరావతి ఉద్యమానికి మొదట్లో.. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు చాలా ఉద్ధృతంగా మద్దతు తెలిపాయి. ఓ వైపు పవన్ కల్యాణ్.. మరో వైపు కన్నా లక్ష్మినారాయణ.. రైతుల కోసం.. బడా…బడా స్టేట్‌మెంట్లు ఇచ్చారు. క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లారు. రెండు పార్టీలు విడివిడిగా ఉన్నప్పుడు.. ఇద్దరూ.. దూకుడుగానే ఉన్నారు. అయితే.. ఏ ముహుర్తాన.. పవన్ కల్యాణ్ .. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో కానీ.. అప్పుటి నుంచి ఇద్దరూ సైలెంటయిపోయారు. పొత్తు పెట్టుకున్న మొదట్లో ఉమ్మడిగా పోరాటం చేస్తామని.. సమన్వయ కమిటీల్ని ఏర్పాటు చేసుకుంటామని ప్రకటించారు. ఇప్పుడు.. ఆ ఉమ్మడి పోరాటం ఊసు లేదు.. రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీలనే చర్చ కూడా లేదు.

రాజధాని రైతుల ఆందోళనలు… ఉద్ధృత స్థాయికి చేరాయి. పోలీసుల నిర్బంధాలు.. లాఠీచార్జుల మధ్య వారి పోరాటం…70 రోజులగా సాగుతోంది. రాజకీయ పార్టీల నేతలు వస్తున్నారు.. సంఘిభావం తెలిపి పోతున్నారు. గట్టిగా అండగా నిలబడుతున్న వారు ఎవరూ లేరు. అయినా రాజధాని రైతులు, రైతు కూలీలు వారు మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. రాజధాని అమరావతిలోనే ఉండాలని పోరాటం చేస్తున్నారు. జీవనోపాధిని.. కుటుంబాలను పట్టించుకోకుండా.. మహిళలు, రైతులు.. రోడ్ల మీదనే ఉంటున్నారు. రోజులు గడిచిపోతున్నాయి… కానీ భరోసా ఇస్తున్న వారు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు.

కేంద్రం దగ్గర నుంచి హామీ తీసుకున్నానని… ఆ మేరకు పొత్తు పెట్టుకున్నానని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. మూడు రాజధానులతో తమకు సంబంధం లేదని ఢిల్లీ బీజేపీ చెబుతోంది. తాము అన్నీ చెప్పే చేస్తున్నామని… వైసీపీ చెబుతోంది. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చేయాలనుకున్నది చేసుకుంటూ పోతోంది. బీజేపీ.. జనసేన పోరాడితే.. రైతులకు ధైర్యంగా ఉంటుంది.ఎందుకంటే.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ తల్చుకుంటే.. అమరావతి ఎక్కడికీ పోదు. ఆ విషయం రైతులకు క్లారిటీ ఉంది. కానీ.. వీరావేశంగా గతంలో ప్రకటనలు చేసిన… బీజేపీ, జనసేన.. ఇప్పుడు మాత్రం.. ఉమ్మడి పోరాటం విషయంలో.. ఉలుకూ..పలుకూ లేకుండా పోయాయి. ఈ సమయంలో.. మద్దతు ప్రకటించకపోతే… మరి ఈ రెండు పార్టీలు ఎప్పుడు ఉద్యమం చేస్తాయో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

రైతు భరోసా స్టార్ట్ … క్రెడిట్ బీఆర్ఎస్ దేనా..?

రైతు భరోసాకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కేసీఆర్ తనదైన రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల వేళ పెట్టుబడి కింద రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతుండటంతో ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఖాతాలో వేస్తున్నారు....

ఓటేస్తున్నారా ? : కష్టాల్లో నేనున్నానని భరోసా ఇచ్చే పాలకుడెవరో ఆలోచించండి !

ఓ డ్యామ్ పగిలిపోయింది.. కొట్టుకుపోయింది. డ్యామ్ అంటే చిన్న విషయం కాదు. ఆ డ్యామ్ ఎందుకు కొట్టుకుపోయిందన్న సంగతి తర్వాత ముందుపాలకుడు ఏం చేయాలి ?. ఉన్న పళంగా అక్కడికి వెళ్లి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close