షా పర్యటన రద్దు: కరోనానా కుమ్ములాటలా..

కేంద్ర హోం శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ సుప్రీం అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు వెనక ఎలాంటి కారణం ఉందో తెలంగాణ బిజెపి నాయకులు చెప్పలేకపోతున్నారు. కరోనా వైరస్ కారణంగా పర్యటన రద్దు అయిందని పైకి చెబుతున్నా అంతర్గతంగా పార్టీలో కుమ్ములాటలే కారణమని అంటున్నారు. పౌరసత్వ చట్టంతో పాటు ఇతర అంశాలపై పార్లమెంటులో దుమారం రేగుతున్న సమయంలో హైదరాబాద్ వచ్చి పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఉన్న ప్రస్తుత సమయంలో హైదరాబాద్ పర్యటించడం అవసరమా అని హోంమంత్రి అమిత్ షా స్థానిక బీజేపీ నాయకుల వద్ద అన్నట్లు చెబుతున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఓ నాయకుడ్ని వెతకాల్సిన ఈ సమయంలో పార్టీలో ఆ పదవి కోసం పైరవీలు, కుమ్ములాటలు ఎక్కువవుతున్నాయని పార్టీ అధిష్గానం భావిస్తోంది. ఈ సమయంలో అమిత్ షా హైదరాబాద్ వస్తే ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం పలువురు నాయకులు నానా హంగామా చేస్తారని, అమిత్ షా పాల్గొనే బహిరంగ సభకు తాము ఎక్కువ మందిని తీసుకువచ్చామంటే తామే ఎక్కువ మందిని తీసుకువచ్చామంటూ కొత్త వాదాలు ముందుకు వస్తాయని అధిష్టానం భావించినట్లు చెబుతున్నారు.

ఇలాంటి సమయంలో ఈ పర్యటన వాయిదా వేసుకుంటే మంచిదని హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా పార్టీ సుప్రీంతో అన్నట్లు చెబుతున్నారు. ఈ నెల 15వ తేదిన నగరంలో బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారు వారి వారి జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని అనుకున్నారు. ఆ విధంగా తమ బలాన్ని, బలగాన్ని ప్రదర్శించాలని భావించారు. అయితే, దీనిని తెలుసుకున్న ఇప్పుడు బహిరంగ సభకు వచ్చి మళ్లీ వివాదాలను పెంచడం ఎందుకని మిన్నకున్నట్లు చెబుతున్నారు. బహిరంగ సభ రద్దుకు కారణాలను వెతకాల్సిన పని లేకుండా కరోనా వైరస్ కాపాడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరులోగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుని ఎంపిక చేసి అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధిష్టానం భావిస్తున్నట్లు
సమాచారం.  

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close