“అమ్మో .. ఒకటో తేదీ..” భయం లేకుండా చేస్తున్న కేంద్రం..!

ఒకటో తేదీ వస్తోంది. సాధారణ పరిస్థితులు ఉండి.. జీతం ఠంచన్‌గా.. వస్తుందనుకుంటున్న సమయాల్లోనే మధ్య తరగతి జీవికి గుండె గుభేలుమంటుంది. ఖర్చులన్నీ పోను.. ఇంకా ఎంత అప్పులు చేయాలోనన్న టెన్షన్ ఉంటుంది. ఇంటి అద్దె.. పాల బిల్లు.. కరెంట్ బిల్లు.. ఇలా చాంతాడంత లిస్ట్ ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా.. ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఇలాంటి భయాల నుంచి.. రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మహానగరాల్లో అద్దెకు ఉంటున్న వారికి కొంత రిలీఫ్ ఇచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇంటి అద్దెల కోసం.. యజమానులు ఒత్తిడి చేయవద్దనే సూచనలు పంపాయి.

ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలాంటి సందేశం పంపగా.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇదే సూచనలు పంపింది. అద్దెల కోసం ఒత్తిడి తెచ్చే యజమానులపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడవద్దని స్పష్టం చేసింది. మహా నగరాల నుంచి ఓ మాదిరి మున్సిపాల్టీల వరకూ..ఎక్కువ మంది అద్దె ఇళ్లలోనే ఉంటూంటారు. వ్యాపార సముదాయాలు అయిదే.. మొత్తం.. అద్దె భవనాల్లోనే ఉంటాయి. ఇవన్నీ… గత పది రోజులుగా మూత బడిపోయాయి. వచ్చే రెండు వారాలు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అంటే.. ఒక్కటంటే.. ఒక్క రూపాయి లావాదేవీ జరిగే అవకాశం లేదు. ఈ కారణంగా.. ఎవరికీ ఆదాయం వచ్చే పరిస్థితి లేదు.

ఒకటో తేదీ తర్వాత ఇంటి అద్దెల కోసం.. దుకాణాల అద్దెల కోసం.. యజమానుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ మంది అద్దె ఇళ్లలో ఉండరు. ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు అద్దె ఇళ్లల్లో ఉంటున్నప్పటికీ.. వారికి ఈ నెల జీతాలు సమస్యలు రాకుండా అందే అవకాశం ఉంది. అయితే.. చిరు వ్యాపారులు..రోజు కూలీలు.. ఇతర రోజువారీ వ్యవహారాల మీద నడిచే వ్యాపారాలు చేసుకునేవారికి మాత్రం ఇబ్బంది తప్పదు. ఈ కారణంగానే.. కేంద్రం.. అద్దెల విషయంలో ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే..ప్రభుత్వాలు హెచ్చరించాయని.. యజమానులు వసూలు చేయడం వాయిదా వేస్తారేమో కానీ.. ఆ తర్వాతైనా వసూలు చేస్తారు. కట్టడం వాయిదా అనే రిలీఫ్ మాత్రం లబించొచ్చు. కరెంట్ బిల్లు విషయంలోనూ కేంద్రం రిలీప్ ఇచ్చే ఆలోచన చేస్తుందని… కేంద్ర విద్యుత్ మంత్రి సూచన ప్రాయంగా చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close