మీడియా వాచ్‌: ‘సండే’ మైగ‌జైన్లు ఎత్తేశారు

ఆదివారం వ‌చ్చిందంటే దిన ప‌త్రిక కాస్త ప్ర‌త్యేకంగా క‌నిపిస్తుంది. మ‌రీ ముఖ్యంగా సండే మైగ‌జైన్ అద‌నంగా వ‌స్తుంది. బోలెడంత స‌మాచారం, కాల‌క్షేపం. అందుకే ఆదివారం దిన ప‌త్రిక కొనేవాళ్లు, చ‌దివేవాళ్లు ఎక్కు. ఆ రోజు స‌ర్క్యులేష‌న్ కూడా ఎక్కువే. దాంతో పాటు మిగిలిన రోజుల‌తో పోలిస్తే.. ధ‌ర కూడా ఓ రూపాయి ఎక్కువే ఉంటుంది. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి సండే మైగ‌జైన్ల‌నీ మింగేసింది. ఇప్ప‌టికే లాక్ డౌన్ వ‌ల్ల‌, దిన ప‌త్రిక సైజు క్షీణించింది. ఇప్పుడు ఆదివారం అనుబంధ ప‌త్రిక‌ల్నీ ఎత్తేశాయి యాజ‌మాన్యాలు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి ప‌త్రిక‌లు ఆదివారం అనుబంధాన్ని ఇవ్వ‌లేదు. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆదివారం అనుబంధం అందివ్వ‌లేక‌పోతున్నామ‌ని మాత్రం ప్ర‌క‌టించాయి. సాక్షి ప్ర‌త్యామ్నాయంగా.. ప‌త్రిక‌ను టాబ్లాయిడ్ గా మార్చేసింది. న‌మ‌స్తే తెలంగాణ మాత్రం య‌ధావిధిగా సండేబుక్ (బ‌తుక‌మ్మ‌) అందించగ‌లిగింది. సండే మ్యాగ‌జైన్ నిర్వ‌హిచ‌డం, వారం వారం అందించ‌డం చాలా క‌ష్ట‌మైన వ్య‌వ‌హార‌మే. పైగా ఖ‌ర్చుతో కూడిన ప‌ని. ఏ వంక‌తో సండే మ్యాగ‌జైన్‌ని ఆపేయాలా అని ప్ర‌ధాన దిన ప‌త్రిక‌ల‌న్నీ ఎదురుచూస్తుంటాయి. ఇప్పుడు వాళ్ల‌కు క‌రోనా సాకుగా క‌నిపించింది. మ‌రి ఈ ఎత్తివేత ఈ వారం మాత్ర‌మేనా, క‌రోనా ప్ర‌భావం త‌గ్గేంత వ‌ర‌కూ కొన‌సాగుతుందా అనేది మాత్రం ఇప్పుడే చెప్ప‌లేని ప‌రిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close