గుళ్లో పెళ్లి చేసుకుందామ‌నుకున్నా: నిఖిల్‌

క‌రోనా ఎఫెక్టుకి ఇబ్బంది ప‌డిన వాళ్ల‌లో నిఖిల్ కూడా ఉన్నాడు. ఎందుకంటే.. క‌రోనా వ‌ల్లే త‌న పెళ్లి వాయిదా ప‌డింది. ప‌ల్ల‌వి వ‌ర్మ అనే డాక్ట‌రుని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు నిఖిల్. కాక‌పోతే క‌రోనా వ‌ల్ల ఈ పెళ్లి ఆల‌స్యం అవుతోంది. అయితే ఓ ద‌శ‌లో గుళ్లో అయినా పెళ్లి చేసేసుకుందాం అనుకున్నాడ‌ట నిఖిల్‌. కానీ ఆ నిర్ణ‌యాన్నీ వాయిదా వేశాడు. ”అవును.. మేం హంగులూ, ఆర్భాటాలూ లేకుండా క‌నీసం గుళ్లో అయినా పెళ్లి చేసేసుకుందాం అనుకున్నాం. అయితే ఇలాంటి స‌మ‌యంలో పెళ్లి పేరుతో అంద‌రినీ ఒకే చోట గేద‌ర్ చేయ‌డం నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకం. ఎవ‌రికి ఎలాంటి ఇబ్బంది క‌లిగినా ఆ బాధ జీవితాంతం వెంటాడుతుంది. అందుకే పెళ్లి వాయిదా వేశాం. అన్నీ స‌ర్దుకున్నాక ఓ పెద్ద వేడుక‌లా నా పెళ్లి జ‌రుగుతుంది” అని చెప్పుకొచ్చాడు నిఖిల్‌.

ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా ప‌ల్ల‌విని క‌లిశాన‌ని, ఆరు నెల‌ల్లోనే పెళ్లి వ‌ర‌కూ వెళ్లిపోయామ‌ని, త‌మ పెళ్లికి ఇరువురి కుటుంబ స‌భ్యులు ఆనందంగా ఒప్పుకున్నార‌ని చెప్పాడు నిఖిల్‌.అన్ని విష‌యాల్లోనూ ఇద్ద‌రి అభిప్రాయాలూ ఒకేలా ఉంటాయ‌ని, ప‌ల్ల‌వి త‌న‌కంటే ఎన‌ర్జీగా ఉంటుంద‌ని త‌నకు కాబోయే శ్రీ‌మ‌తి గురించి చెప్పుకొచ్చాడు. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో పాత సినిమాలు చూస్తున్నాన‌ని, బాడీ పెంచుతున్నాన‌ని, త‌మిళం కూడా నేర్చుకుంటున్నాన‌ని సెల‌విచ్చాడీ కుర్ర హీరో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ : రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలిసుల నోటిసులు..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close