చైనా పెట్టుబడులనూ సరిహద్దుల్లోనే ఆపేసిన భారత్..!

సంక్షోభంలో కూరుకుపోయిన భారత కార్పొరేట్ కంపెనీలను చైనా చేజిక్కించుకునే కుట్ర చేస్తోందని…కేంద్రం మేలుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మూడు రోజుల కిందట ఆందోళన వ్యక్తం చేశారు. చైనాకు చెందిన కొన్ని కంపెనీలు.. సీక్రెట్‌గా… కార్పొరేట్ సంస్థల్లో వాటాలు పెంచుకుటూండటంతో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం కూడా.. ఈ అంశాన్ని గమనించింది. వెంటనే… విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. కష్టకాలంలో భారత కంపెనీను హస్తగతం చేసుకోవాలన్న చైనా ప్రయత్నాలకు కేంద్రం అడ్డుకట్ట వేసేసింది.

భారత్‌తో సరిహద్దులు కలిగిన దేశాలు …ఇక్కడి కంపెనీల్లో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు తప్పక తీసుకోవాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిబంధనలు మార్చింది. ప్రస్తుతం కంపెనీలకు కష్టకాలం వచ్చింది. లాక్ డౌన్ వల్ల కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తోంది. అలాంటి కంపెనీల మీద విదేశీ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఆయా సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసి.. భారత్‌లోని కంపెనీల్లో తమ వాటాను పెంచుకునేందుకు, లేదా ఏకమొత్తంగా కైవసం చేసుకునేందుకు దీన్ని అవకాశంగా మలుచుకుంటున్నాయి. చైనా ఇదే వ్యూహంతో ఉన్నట్లు కేంద్రానికి ఖచ్చితమైన సమాచారం అందింది. విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడంతో పాటు భారత కంపెనీల ఓనర్ షిప్‌ను మార్పు చేసే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ నిబంధనల్లో మార్పులు చేశారు.

గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ విషయంలో ఈ తరహా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా చైనాకు చెందిన పలు కంపెనీలు భారత్‌లోని ఆర్థిక కష్టాల్లో ఉన్న కంపెనీల నుంచి వాటాలు కొనుగోలు చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓ రకమైన ఆర్థిక ఎమర్జెన్సీ కనిపిస్తోంది. భారీ మాంద్యం కళ్ల ముందు ఉందని.. ఐఎంఎఫ్ లాంటిసంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఆర్థిక పునాదులు బలంగా ఉన్న భారత కార్పొరేట్ సంస్థలకు ఇది ఆందోళనకరమైన అంశమే. అవి చేతులు మారితే.. భారత ఆర్థిక వ్యవస్థ విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే..కేంద్రం.. ఈ అంశంలో వేగంగా స్పందించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close