మరో 80 కేసులు..! ఏపీలో పడగ విప్పుతున్న వైరస్..!

ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌లు.. క్వారంటెన్‌లు ఏ మాత్రం వర్కవుట్ అవుతున్న సూచనలు కనిపించడం లేదు. ఇరవై నాలుగు గంటల్లో 80పాజిటివ్ కేసులు నమోదవడం…. దూసుకొస్తున్న కొత్త ప్రమాదానికి సంకేతంగా కనిపిస్తోంది. కర్నూల్‌లో అత్యధికంగా 31 కేసులు నమోదయ్యాయి. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 200 దాటిపోయింది. గుంటూరులో 18, చిత్తూరులో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనాపై పోరాడి కోలుకుని 141 మంది డిశ్చార్జ్ కాగా.. 27 మంది మరణించారు. ప్రస్తుతం 725 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ సామాజిక వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉందన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి.

పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నప్పటికీ.. ఏపీ సర్కర్ భయపడాల్సిందేమీ లేదని చెబుతోంది. ఎందుకంటే.. తాము టెస్టుల సామర్థ్యాన్ని పెంచుకున్నామని.. పెద్ద ఎత్తున టెస్టులు చేస్తున్నందునే.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని… చెబుతున్నారు. గత ఇరవై నాలుగు గంటల్లో 6వేల 5వందలకుపైగా టెస్టులు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో భారీగా కేసులు బయటపడినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో… టెస్టులు చేయలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కర్నూలు, గుంటూరులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణలో పాజిటివ్ కేసుల నమోదు తగ్గిపోయింది. నిన్న పద్నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే గ్రీన్ జోన్ల వారీగా… మినహాయింపులు ఇచ్చిన ఏపీలో మాత్రం… కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రెడ్ జోన్లలో మాత్రం ఎవరికీ మినహాయింపులు ఇవ్వలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close