కరోనాపై పోరులో ఏపీ శభాష్..!

వైరస్‌పై పోరాటంలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ప్రతిభను కనబరుస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కూడా.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ పనితీరును అభినందించారు. చురుగ్గా పరీక్షలు నిర్వహించడంతో పాటు.. కేసుల కట్టడికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఆయన అన్నారు. ఆ అభినందనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హమైనదే. ఎందుకంటే… టెస్టుల సామర్థ్యాన్ని పెంచుకోవడంలో.. పొరుగు రాష్ట్రాలకు మించి మెరుగైన ప్రతిభను కనబర్చింది. ఇప్పుడు రోజుకు పదివేలకుపైగా టెస్టులు జరుగుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే.

టెస్టుల్లో ఏపీ నెంబర్ వన్..!

కరోనా వైరస్ విజృంభణ ప్రారంభమైన మొదట్లో పట్టుమని పది టెస్టులు చేయలేని పరిస్థితి ఆంధ్రది. కానీ నెల రోజుల్లోనే పదివేల టెస్టులు చేయగలిగే సామర్థ్యం తెచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకు 2,01,196 కరోనా పరీక్షలు చేశారు. ప్రతి పది లక్షల జనాభాకు 3700మందికిపైగా పరీక్షలు చేశారు. ఇంత సగటు మరే రాష్ట్రంలోనూ లేదు. ఏ రకంగా చూసినా జాతీయస్థాయితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ సగటు ఎంతో మెరుగ్గా ఉంది. కొత్త కేసుల కన్నా.. కోలుకుని ఇళ్లకు వెళ్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. రికవరీ రేటు దేశంలో 33 శాతంగా మాత్రమే ఉంది. ఏపీలో ఇది 53 శాతంగా ఉంది.

మర్కజ్, కోయంబేడు, వలస కూలీలు వస్తున్నా అదే పట్టుదల..!

పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ.. వైరస్‌ ఉన్న వారిని ఐసోలేషన్‌కి పంపుతూండటంతో.. కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది కానీ.. భవిష్యత్‌లో వచ్చే ముప్పు మాత్రం.. తగ్గిపోతుందని భావించవచ్చు. ఒకరి నుంచి ఒకరికి అయ్యే వ్యాప్తి తగ్గిపోతుంది. ఫలితంగా భవిష్యత్‌లో కేసులు నమోదు కావు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఓ సారి మర్కజ్.. మరోసారి కోయంబేడు మార్కెట్.. చిక్కులు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం వలస కూలీలు పెద్ద ఎత్తున వస్తున్నారు. అలాగే.. ఇతర దేశాల నుంచి కూడా.. ప్రవాసాలు వస్తున్నారు. ఇలాంటి వారి ద్వారా మళ్లీ కరోనా కేసులు పెరుగుతాయని భావిస్తున్నారు. అయినప్పటికీ.. అందరికీ పక్కాగా చికిత్స అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

కేరళ స్థాయిలో రికవరీ రేటు..!

ఏ రాష్ట్రంలోనూ కరోనా బాధితులకు డబ్బులు ఇవ్వడం లేదు. ఏపీ సర్కార్.. డిశ్చార్జ్ అవుతున్న వారికి.. క్వారంటైన్ కేంద్రం నుంచి వెళ్తున్న వారికి రూ. రెండు వేలు అందిస్తోంది. రోగ నిరోధకశక్తి పెంచే.. ఆహారాన్ని అందిస్తోంది. అందుకే.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి.. త్వరలో కేరళ తరహాలో ఏపీలోనూ.. కరోనా కట్టడి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close