ప్యాకేజీ నిధులను ఇస్తున్న పెట్రోల్, డీజిల్..!

ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటిస్తోంది. ఈ వివరాలను విడతల వారీగా ప్రకటిస్తున్నారు. అయితే.. ఇంత పెద్ద మొత్తాన్ని కేంద్రం ఎక్కడ నుంచి సమీకరిస్తుందన్నది పెద్ద ప్రశ్న. జీడీపీని పట్టించుకోకుండా నోట్లు ముద్రిస్తే దేశంలో ఆరాచకం ఏర్పడుతుంది. మరి ఎలా ఆ మొత్తాన్ని సమకూర్చుకుంటుందనే సందేహం చాలా మందిలో ఉంది. దానికి సమాధానంగా.. పెట్రోల్, డీజిల్‌ వైపు చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. వాటి మీద వచ్చే … పెంచబోతున్న పన్నులతోనే.. దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ధన ఇంధనాన్ని సమకూర్చాలనుకుంటోంది. వీటితో పాటు ఆర్బీఐ డివిడెండ్‌ను కూడా ఉపయోగించుకోబోతోంది.

అంతర్జాతీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిపోయాయి. బ్యారెల్ ధర ఇరవై డాలర్లలోపే ఉంది. కానీ భారత్‌లో మాత్రం లీటర్‌ రూ. 75 కి తక్కువ కాకుండా అమ్ముతున్నారు. ఇందులో రూ. యాభై ఐదు రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి వెళ్తున్నాయి. ఇలా ఏటా ప్రభుత్వానికి రూ. మూడు లక్షల కోట్లకుపైగా వస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు.. ప్రజలకు ఆ లాభాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. కానీ కేంద్రం.. మే 5న గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్పై లీటరుకు రూ.10, డీజిల్పై లీటరుకు రూ.13 ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఈ పెంపు వల్ల 2021 ఆర్థిక ఏడాదిలో రూ. 1,75,000 కోట్ల ఆదాయం సమకూరనుంది. ఇంతటితోనే సరిపెట్టుకోవడం లేదు.. త్వరలో లీటరుకు రూ. 3-6 పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని ద్వారా సుమారు రూ. 50,000-60,000 కోట్లు అదనపు రాబడి రానుంది. అంటే ఐదు లక్షల కోట్ల వరకూ.. ప్రజల నుంచి పెట్రో ఉత్పత్తులపై పన్నుల ద్వారానే పిండుకుంటారన్నమాట.

ఆర్బీఐ వద్ద ఉన్న మిగులు నిధులను డివిడెండ్ రూపంలో కేంద్రం తీసుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రూ.1,76,000 కోట్లు తీసుకుంది. ఈ ఏడాది కూడా ఇంతే మొత్తంలో తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు, అదనపు ఖర్చులకు గాను ప్రభుత్వం ఈ ఏడాది రుణాల లక్ష్యాన్ని 50 శాతానికిపైగా పెంచింది. 2020-21 ఏడాదికిగాను రుణాలు బడ్జెట్ అంచనా రూ. 7.80లక్షల కోట్లుగా వేసింది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దానిని రూ. 12 లక్షల కోట్లకు పెంచింది. అంటే.. పన్నులు, ఆర్బీఐ, రుణాల ద్వారా మొత్తం ప్యాకేజీ నిధులు సమకూర్చుకుంటోందన్నమాట. ఇంతా చేసి.. ఆ నిధులన్నీ.. పరిశ్రమలకు.. ప్రజలకు అప్పుల రూపంలోనే అందిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close