చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు.. డీజీపీ పర్మిషన్ ఇచ్చారు..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనకు ఏపీ డీజీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మధ్యాహ్నం హోంమంత్రి సుచరిత చంద్రబాబు దరఖాస్తు చేసుకోలేదని మీడియాతో చెప్పడంతో… చంద్రబాబు పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే ఉద్దేశంలో లేదన్న ప్రచారం జరిగింది. అయితే.. సాయంత్రానికి పర్మిషన్ ఇస్తున్నట్లుగా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో.. విశాఖ నుంచి… ఉండవల్లికి రోడ్డు మార్గం ద్వారా.. చంద్రబాబు వెళ్లడానికి డీజీపీ పర్మిషన్ ఇచ్చారు. అరవై ఐదు ఏళ్లు దాటిన వారు.. అప్రమత్తంగా ఉండాలని.. బయటకు రాకూడదన్న నిబంధనలు ఉన్నందున… తగిన జాగ్రత్తలు తీసుకోనాలని డీజీపీ తన అనుమతి పత్రంలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం.. విమానంలో విశాఖ వెళ్లి అక్కడి నుంచి వెంకటాపురం వెళ్లి గ్యాస్ లీక్ బాధితుల్ని చంద్రబాబు పరామర్శిస్తారు. 

ఆ తర్వాత జిల్లా టీడీపీ నేతలతో సమావేశం అవుతారు. తర్వాత ఉండవల్లి బయలుదేరి వెళతారు. కొద్ది రోజుల క్రితం.. చంద్రబాబు.. విశాఖలో వైసీపీ నేతల భూదందాలను బయటపెడతానంటూ.. విశాఖ పర్యటనకు బయలుదేరారు. పోలీసులు పర్మిషన్ కూడా ఇచ్చారు. అయితే.. ఆయన విమాశ్రయంలో దిగేటప్పటికీ.. వైసీపీ కార్యకర్తలందర్నీ..  ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోకి అనుమతించి.. వారిని చెదరగొట్టకుండా… చంద్రబాబునే వెనక్కి పంపారు. ఈ వ్యవహారంపై హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేసింది. విశాఖ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్తూండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. 

చంద్రబాబు ఎప్పుడు వచ్చినా అడ్డుకుంటామని గతంలో వైసీపీ నేతలు ప్రకటించి ఉన్నారు. అప్పట్లో విశాఖ పోలీసులు చంద్రబాబు పర్యటనకు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు నేరుగా డీజీపీనే ఇచ్చారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో గుమికూడటానికి.. ఆందోళనలకు… పర్మిషన్ ఉండదు. చంద్రబాబును అడ్డుకోవాలని అనుకుంటే వైసీపీ నేతలకు.. అలాంటి రూల్స్ వర్తించకపోవచ్చని గత అనుభవాలు చెబుతున్నాయి. అందుకే..  చంద్రబాబు పర్యటన ఆసక్తి రేకెత్తిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close