ఏడాదిలో 90 శాతం హామీలు అమలు చేశాం : జగన్

మద్యం రేట్లను పెంచడం ద్వారా మద్యం తాగే వారి సంఖ్య 24 శాతం మేర తగ్గిపోయిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చారు. పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. మన పాలన- మీ సూచన అనేక ఐదు రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి రోజు పాలన వ్యవస్థలో వికేంద్రీకరణ, సచివాలయాల వ్యవస్థపై చర్చ జరిగింది. సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. లబ్ధిదారులు, వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించినవారితో మాట్లాడి.. ప్రభుత్వ పనితీరుపై సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జగన్ వివక్షలేని పాలన అందించాలని గట్టిగా అనుకున్నానని.. ఆ మేరకు.. మనసా, వాచా, కర్మణా నీతివంతంగా పాలన అందిస్తున్నానన్నారు. చివరి లబ్దిదారుడి వరకు అందరికీ న్యాయం చేసేందుకు విప్లవాత్మక మార్పులు తెచ్చామని గుర్తు చేశారు. ప్రజల ఇంటి ముందుకే సంక్షేమ ఫలాలు తెచ్చి ఇస్తున్నామని గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలో నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చామన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా లక్షా 35వేల ఉద్యోగాలు.. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమించామని .. ప్రజలందరూ సంతృప్తి చెందే స్థాయిలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గతంలో లంచమిస్తే తప్ప పెన్షన్‌ రాని పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు ప్రతినెలా ఒకటో తారీఖు ఉదయాన్నే చిరునవ్వుతో పెన్షన్‌ అందిస్తున్నామని గుర్తు చేశారు. మద్య నియంత్రణ కోసమే…రేట్లను భారీగా పెంచామని.. అందు వల్ల గతంలో వారానికి ఐదుసార్లు తాగేవాళ్లు ఇప్పుడు రెండుసార్లే తాగుతున్నారని విశ్లేషించారు. ప్రతి గ్రామంలో ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం.. 54 రకాల మందులు గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచబోతున్నామన్నారు. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామని .. మొదటి సంవత్సరంలోనే 90శాతం మేనిఫెస్టో హామీలను అమలు చేశామని జగన్ ప్రకటించారు. మహిళలతో పాటు వివిధ వర్గాలతో జగన్ ముఖా ముఖి మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా సంక్షేమ పాలన నడుస్తోందన్నారు. మరో నాలుగు రోజుల పాటు ఈ మేథోమథనం జరుగుతుంది. ఆ తర్వాత 30వ తేదీన ప్రమాణస్వీకారం చేసి ఏడాది అయిన సందర్భంగా… సంబరాలు చేసుకుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close