బీజేపీ గవర్నరేగా సంతకం పెట్టింది..! ఎలా స్వాగతిస్తున్నారు..?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని..హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. పోటీలు పడి స్వాగతించారు. ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావు దగ్గర నుంచి అనంతపురంలోని విష్ణువర్ధన్ రెడ్డి వరకూ అందరూ ప్రభుత్వానికి చెంపపెట్టు అనే విమర్శు చేశారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఈ అత్యంత వివాదాస్పద నిర్ణయం.. ఏపీ సర్కార్ తీసుకోవడానికి వెనుక ఉన్నది బీజేపీ దన్నేనని చాలా మంది అనుమానం. ఎన్నికల సంఘం అధికార పరిధుల్లోకి ప్రభుత్వాలు చొచ్చుకురాకుండా… రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. ఆ విషయంలో తిరుగులేని తీర్పులు ఉన్నాయి.

అయినప్పటికీ.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. తన వద్దకు ఫైల్ వచ్చిన గంటల‌్లోనే క్లియర్ చేశారు. అత్యంత రహస్యంగా జరిగినప్రక్రియకు తన వంతు సాయం చేశారు. ఆర్డినెన్స్‌కు మాత్రమే కాదు.. ఎస్‌ఈసీ నియామకానికి కూడా ఆయన శరవేగంగా ఆమోదం తెలిపారు. ఆయన సంతకాలు పెట్టిన విషయం.. మొత్తం వ్యవహారం బయటకు వచ్చిన తర్వాతనే తెలిసింది. ఆ వేగం.. ఆ సీక్రెసీని బట్టి చూస్తే.. ఢిల్లీ అండ ఉంటేనే ఏపీ సర్కార్ ఇంత సాహసం చేస్తుందని ఎవరైనా నమ్ముతారు. అందుకే.. గవర్నర్ హరిచందన్ కూడా.. కళ్లు మూసుకుని సంతకాలు పెట్టారని భావించారు.

కానీ ఇప్పుడు హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా రాగానే బీజేపీ నేతలు.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశారు. ఇదే డబుల్ గేమ్ ఏమో అన్న చర్చ.. ఇప్పుడు ప్రారంభమయింది. ఏపీ సర్కార్ చేస్తున్న ప్రతీ ప్రయత్నానికి బీజేపీ మద్దతు ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రజలు కూడా అదే భావనలో ఉన్నారు. చట్ట, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను.. ఢిల్లీ స్థాయిలో అడ్డుకునే అవకాశం ఉన్నప్పటికీ కోర్టుల్లో వీగిపోయిన తర్వాతనే.. తాము వాటిని వ్యతిరేకించినట్లుగా ప్రకటనలు చేయడం.. రాజకీయంలో భాగం ఏమో అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close