వైసీపీలో “వన్ ఇయర్” మార్పు..! సజ్జలే నెంబర్ టూ..!?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ ఎవరు అంటే.. అందరూ.. ఎంపీ విజయసాయిరెడ్డి పేరును మొదటి ఆప్షన్‌గా పెడతారు. ఎందుకంటే.. అంత క్రియాశీలకంగా ఉంటారు ఆయన. అటు ఢిల్లీలో పరిస్థితుల్ని చక్క బెడతారు.. ఇటు తెలంగాణ సర్కార్‌తో వ్యవహారాలు నడుపుతారు.. అదే సమయంలో.. ఏపీలో పార్టీ కార్యక్రమాల్ని.. ఉత్తరాంధ్రలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌ని సైతం సమన్వయ పరుస్తారు. నిన్నామొన్నటిదాకా పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమం అయినా.. పని అయినా… విజయసాయిరెడ్డినే సంప్రదించమని.. జగన్మోహన్ రెడ్డి సూచించేవారు. అయితే.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే.. పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు.. పార్టీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో చూసుకునేందుకు .. మరో కీలక సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి పవర్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇందు కోసం.. సజ్జల ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారు. రోజూ ఆయన కేంద్ర కార్యాలయానికి వచ్చి కొంత సేపు పార్టీ వ్యవహారాల్ని పర్యవేక్షించబోతున్నారని చెబుతున్నారు. ఇక పార్టీ తరపున ఎలాంటి పనులకైనా.. విజయసాయిరెడ్డిని సంప్రదించరాదనే సంకేతాలు.. పార్టీలోని.. ఓ స్థాయి నేతలకు చేరినట్లుగా తెలుస్తోంది. ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా.. ఈ పరిణామం.. వైసీపీ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డి సొంత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారనే సందేహాలు..వైసీపీలో ప్రారంభమయ్యాయి. ఆయన ఉత్తరాంధ్రలో చేపట్టిన సేవా కార్యక్రమాల్లో.. పంచిన సరుకుల సంచుల్లో జగన్ బొమ్మ లేదు. పూర్తిగా విజయసాయిరెడ్డి బొమ్మే ఉంది.

అదే సమయంలో… ఓ సందర్భంలో విజయసాయిరెడ్డి.. సుజనా చౌదరికి హెచ్చరికలు చేస్తూ.. ఆయన దగ్గర తాను పని చేశానని ఆ లొసుగులన్నీ తెలుసని హెచ్చరించారు. ఇది సుజనాకు చేసింది కాదని..నేరుగా జగన్‌కు చేసిందనే అనుమానాలు వైసీపీలో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందన్న చర్చ ప్రారంభమయింది. ఈ మార్పు.. ఆ కోవలోకేనా.. లేక.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది.. ఆ పార్టీలో జరిగే పరిణామాల్ని బట్టి బయటకు తెలిసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close