బాలయ్య కోసం చిన్నికృష్ణ

నే‌టి ట్రెండ్‌ని… నేటి ప్రేక్ష‌కుల నాడిని ప‌ట్ట‌లేక కెప్టెన్ కుర్చీకి దూర‌మైన సీనియ‌ర్ ద‌ర్శ‌కులు చాలామందే. ఒక‌ప్పుడు అగ్ర ద‌ర్శ‌కులుగా వెలిగిన వాళ్లంతా కూడా ఆ త‌ర్వాత ప్రాభవాన్ని కోల్పోయారు. ప్రేక్ష‌కుల అభిరుచుల్లో వ‌చ్చిన మార్పులే కార‌ణం. కొద్దిమంది ర‌చ‌యిత‌లు కూడా అంతే. ఒక‌ప్పుడు స్టార్ రైట‌ర్‌గా వెలిగాడు చిన్నికృష్ణ‌. సమ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు, ఇంద్ర‌, న‌ర‌సింహ‌… త‌దిత‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌కి క‌థ‌ల్ని అందించారు చిన్నికృష్ణ‌. అయితే ఆ మేజిక్‌ని అట్టే కొన‌సాగించ‌లేక‌పోయారు. `గంగోత్రి` త‌ర్వాత ఆయ‌న్నుంచి చెప్పుకోద‌గ్గ క‌థ మ‌రొక‌టి రాలేదు. ఇప్పుడు ఎలాగైనా మ‌ళ్లీ ఫామ్‌లోకి రావాల‌నేది ఆయ‌న ప్ర‌య‌త్నం. అందుకోసం ఒక శ‌క్తివంత‌మైన క‌థ‌ని సిద్ధం చేశాడు. అది కూడా బాల‌కృష్ణ కోసం. బాల‌కృష్ణ – చిన్ని కృష్ణల‌ది స‌క్సెస్‌ఫుల్ కాంబినేషన్ అన్న విష‌యం తెలిసిందే. తాను మ‌ళ్లీ స‌క్సెస్ అందుకోవ‌డానికి బాల‌కృష్ణ అయితేనే బెట్ట‌ర్ అని భావించి చిన్నికృష్ణ క‌థ‌ని సిద్ధం చేశార‌ట‌. మరి ఆ చిత్రాన్ని ఎవ‌రు తెర‌కెక్కిస్తార‌న్న‌దే స‌స్పెన్స్‌. నిజానికి చిన్నికృష్ణ క‌థ‌ల్ని ఎక్కువ‌గా బి.గోపాల్ తెర‌కెక్కిస్తుంటారు. మ‌రి ఈసారి కూడా ఈ కాంబినేష‌నే సెట్ కాబోతోందా అన్న‌ది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close