ఫామ్‌హౌస్ లొల్లి : రేవంత్ గొడవేనా.. కేటీఆర్ వాదన వినరా..!?

హైదరాబాద్ శివార్లలో జన్వాడ ఫామ్‌హౌస్ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు… నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు..  ఎన్జీటీ ఈ నోటీసులు జారీ చేసింది. దాంతో.. కాంగ్రెస్ నేతలు ఒక్క సారిగా గొంతు సవరించుకున్నారు. కేటీఆర్ రాజీనామా చేయాలని… అలా చేస్తేనే.. ఎన్జీటీ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని అంటున్నారు. అయితే.. కాంగ్రెస్ నేతల ఆరోపణల్ని.. మంత్రి కేటీఆర్ ఒక్క ట్వీట్‌తో తోసి పుచ్చారు. తనది అని చెబుతూ.. ఎన్జీటీలో పిటిషన్ వేశారని.. కాను ఆ ఫామ్ హౌస్ తనది కానే కాదని.. అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని.. కేటీఆర్ హెచ్చరించారు.

కేటీఆర్ వాదన ప్రకారం.. ఆ ఫామ్‌హౌస్ ఆయనది కాదు. ఆయనది కానప్పుడు.. ఆయనకు నోటీసులు వచ్చినా… చేయగలిగిందేమీ లేదు. అది తనది కాదని.. ఓ లేఖను ఎన్జీటీకి పంపిస్తారు. దాంతో ఇష్యూ క్లోజ్ అయిపోతుంది.. ఆ ఫామ్‌హౌస్ ఎవరిది..? జీవో 111కి ఉల్లంఘించి కట్టారా లేదా అన్న ఇతర విషయాలను ఎన్జీటీ విచారణ జరుపుతుంది. అయితే.. ఇక్కడ రాజకీయం అంతా.. కేటీఆర్‌ను టార్గెట్‌ చేసుకుని ఆ ఫామ్‌హౌస్ కేంద్రంగా నడుస్తోంది. అది ఆయనదే అని నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ ఫామ్‌హౌస్‌ను లీజుకు తీసుకున్నామని కేటీఆర్ సంబంధీకులు చెబుతున్నారు. కాదు.. అది ఆయన సొంతమేనని నిరూపిస్తానని.. రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారు.

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకు జన్వాడ ఫామ్‌హౌస్ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. చిన్న సందు దొరికినా.. ఆయన దానిపై ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు… కేటీఆర్.. తనపై చేస్తున్న ఆరోపణలను డిఫెండ్ చేసుకోవడానికి రంగంలోకి దిగారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిసైడయ్యారు. ఆ ఫామ్‌హౌస్ తనది కాదని.. నిరూపించి.. రేవంత్‌పై కేటీఆర్ మరో కేసు పెడతారేమో వేచి చూడాలి..!  

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close