ప్రాజెక్టుల వార్‌తో కేంద్రం చేతుల్లోకి తెలుగు రాష్ట్రాల జుట్టు ..!?

పిట్టపోరు..పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లుగా… తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని కేంద్రం అడ్వాంటేజ్‌గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మరింతగా జోక్యం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. తెలుగు రాష్ట్రాలు పరస్పరం .. ఆయన నదీ యాజమాన్య బోర్డులకు చేసిన ఫిర్యాదుల వివరాలను.. కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న దాదాపు పదిహేను ప్రాజెక్టుల వివరాలను… ఆయా నదీ బోర్డుల యాజమాన్యాలు కేంద్రానికి పంపాయి. ఎప్పుడు ప్రారంభించారు అనే దాని దగ్గర నుంచి ఎంత ఖర్చు చేశారు.. వాటి వల్ల సాగులోకి వచ్చిన భూమి ఎంత.. లాంటి వివరాలన్నీ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. వాటికి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు ఉన్నాయా లేవా అని కూడా కేంద్రం ారా తీసినట్లుగా తెలుస్తోంది.

నిన్నామొన్నటి వరకూ.. పెద్దగా జల వివాదాలు లేని తెలుగు రాష్ట్రాలు హఠాత్తుగా… లేఖలు.,. ఆరోపణలు.. ఫిర్యాదులు చేసుకోవడం ప్రారంభించాయి. గతంలో తమ మధ్య సమస్యలను తామే పరిష్కరించుకుంటామని.. కేంద్రం జోక్యం అవసరం లేదని.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గొప్పగా చెప్పారు. కానీ.. వారే స్వయంగా నదీ యాజమాన్య బోర్డులకు.. జలశక్తి మంత్రిత్వ శాఖలకు ఫిర్యాదు చేయడంతో.. కేంద్రం అడ్వాంటేజ్‌గా తీసుకుంటుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల వివరాలన్నింటినీ తీసుకుని… రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ముందుకెళ్లకుండా చేసే ప్రయత్నం చేయబోతందంటున్నారు. అపెక్స్ కౌన్సిల్ భేటీని నిర్వహించడానికి ఇప్పటికే నిర్ణయించారు.

కేంద్రం జోక్యం చేసుకుంటే.. రెండు రాష్ట్రాల ప్రాజెక్టులు రిస్క్‌లో పడతాయి. ఎందుకంటే.. కొత్త ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్‌లో అనుమతి తీసుకుని మాత్రమే ప్రారంభించాలి. రెండు రాష్ట్రాల్లో గత ఆరేళ్లలో కట్టిన ప్రాజెక్టుల్లో ఒక్క దానికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోలేదు. అయితే.. అవన్నీ పాత ప్రాజెక్టులని ఆయా ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. కానీ తమవే పాతవి అని పొరుగు రాష్ట్రానివి కొత్తవని పరస్పరం ఆరోపించుకుంటున్నారు. ఇప్పుడు వాటికి డీపీఆర్లను కేంద్రానికి సమర్పించాల్సి వస్తే.. కొత్తవో.. పాతవో తేలిపోతుందని అంటున్నారు. అదే జరిగితే.. రెండు రాష్ట్రాలూ.. తమ ప్రాజెక్టుల విషయంలో కొత్త చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సాగునీటి నిపుణులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close