ఆ ముగ్గురు టీడీపీ నేతల అరెస్టులపై స్టే..!

వివిధ రకాల కేసులు మోపబడిన టీడీపీ నేతలు తాత్కాలికంగా అరెస్ట్ ముప్పును తప్పించుకున్నారు. ముఖ్యంగా నిర్భయ కేసు నమోదైన అయ్యన్నపాత్రుడుని.. ఎలాగైనా అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంలో పోలీసులు నిన్నటి నుంచి తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే.. ఆయన ఎక్కడ ఉన్నారో పోలీసులకు అంతుపట్టలేదు. ఈ లోపు.. ఆయన దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. అది రాజకీయ కక్ష సాధింపు పిటిషన్ అని.. కేసులు కొట్టి వేయాలని అయ్యన్న పాత్రుడు హైకోర్టును కోరారు. తప్పుడు కేసులు పెట్టాలని అసలు అయ్యన్న కేసు నిర్భయ చట్టం కిందకు రాదని.. ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. అయితే.. అది నిర్భయ చట్టం కిందకు వస్తుందని.. గతంలో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా ఉన్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు.

ఆ జడ్జిమెంట్లను చూపించాలని… ధర్మాసనం కోరింది. రెండు రోజుల సమయం ఇచ్చింది. రెండు రోజుల వరకూ.. అయ్యన్నపాత్రుడు అరెస్ట్ పై స్టే విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్పుడు అయ్యన్నపాత్రుడు అన్నాడో లేదో తెలియని వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో చూసి తాను ఫిర్యాదు చేశానన్న అధికారిణి ఫిర్యాదు .. నిర్భయ చట్టం కిందకు వస్తాయని.. ఆ మేరకు గతంమలో కోర్టులు తీర్పులు చెప్పాలని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వ న్యాయవాదులపై పడింది. అలాగే.. ఓ పార్టీ నేత పెళ్లికి వెళ్లిన యనమల రామకృష్ణుడు, చినరాజప్పల అరెస్టుపైనా హైకోర్టు స్టే విధించింది. వీరిది మరింత విచిత్రమైన కేసు. ఓ టీడీపీ నేత రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి వీరు హాజరయ్యారు. అయితే.. ఆయన మొదటి భార్య ఎస్సీ. పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు.

కానీ ఆమె తిరిగి ఆ టీడీపీ నేతపై కేసు పెట్టింది. పెళ్లికెళ్లిన చినరాజప్ప, యనమలలే దగ్గరుండి పెళ్లి చేయించారని.. కేసు నమోదు చేయించారు. దాంతో వారిపై అట్రాసిటీ కేసు పెట్టారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే లభించింది. పోలీసులు పెడుతున్న అనూహ్యమైన కేసుల్లో.. అరెస్టుల నుంచి తప్పించుకోవడనికి కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోంది టీడీపీ నేతలకు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close