అవ్వాతాతలకు జగన్ రూ.15,750 బాకీ..! ఆర్ఆర్ఆర్ కొత్త ఫిట్టింగ్..!

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రూటు మార్చారు. ఇప్పటి వరకూ పార్టీ అవకతవకల గురించి మాట్లాడుతూ వచ్చిన ఆయన ఇప్పుడు.. మరింత ముందుకెళ్లారు. వైసీపీ పథకాలు.. హామీలు.. అమల్లోని లోపాలపై గురి పెట్టారు. మొదటి సారి.. వృద్ధులను మోసం చేశారంటూ.. ఓ లేఖను సంధించారు. నేరుగా ముఖ్యమంత్రికే లేఖ రాసి.. తనకు ఇక మొహమాటలు లేవని చెప్పకనే చెబుతున్నారు. రఘురామకృష్ణంరాజు టార్గెట్ చేసిన పథకం… వృద్ధాప్య పించన్లు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధ్యాప్య ఫించన్ వయోపరిమితిని.. 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ అవ్వాతాతల పథకానికి జీవో ఇచ్చారని .. 2019 జులై నుంచి అమల్లోకి వస్తుందని అందులో ఉందన్నారు.

కానీ దాన్ని అమలు చేస్తోందని మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అని గుర్తు చేశారు. దీనివల్ల లబ్దిదారులు 7 నెలల కాలానికి రూ.15,750 నష్టపోయారన్నారు. లబ్దిదారులకు ఆ మొత్తం అందేలా ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఏడాది పెంచుతామన్న రూ.250 పెన్షన్ కానుకను.. వైఎస్‌ జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలని రఘురామకృష్ణరాజు లేఖలో కోరారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. నిరుద్యోగ భృతి సహా.. ఇతర పథకాలను.. చంద్రబాబు ప్రారంభం నుంచి అమలు చేయలేదని జగన్ ఆరోపించేవారు.

ఆ లెక్కలు చెప్పి.. యువతకు రూ. వేల రూపాయలు బాకీ ఉన్నారని చెప్పేవారు. ఇప్పుడు అదే తరహాలో రఘురామకృష్ణంరాజు.. తన పార్టీ లైన్‌లోనే … లేఖలు రాస్తున్నారు. ఇచ్చిన జీవోకు.. అమలు చేసిన కాలానికి మధ్య ఏడు నెలల గ్యాప్ ఉండటంతో.. ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వైసీపీ నాయకత్వంపై పడింది. వైసీపీ పథకాలన్నీ డొల్లగా ఉన్నాయని.. ఎవరికీ పెద్దగా లబ్ది చేకూరడం లేదని విమర్శలు వస్తున్న సమయంలో.. సొంత పార్టీ ఎంపీనే ఆ విషయాన్ని బయట పెట్టడానికి రంగంలోకి దిగడం వైసీపీ నేతలకు మింగుడు పడని అంశమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుకుమార్ కుమార్తెకు దాదా ఫాల్కే అవార్డ్

డైరెక్టర్ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గ‌తంలో ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శించారు....

టీంమిండియాకి ‘ముంబై ఇండియన్స్’ కలవరం

కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ...

‘లాపతా లేడీస్’ రివ్యూ: దారితప్పి మార్గం చూపిన పెళ్లి కూతుళ్ళు

'ధోబీ ఘాట్' లాంటి విలక్షణమైన సినిమా తీసిన కిరణ్ రావు, దాదాపు దశాబ్ద విరామం తర్వాత 'లాపతా లేడీస్' కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ...

టాలీవుడ్‌ ‘మే’ల్కొంటుందా?

2024 క్యాలెండ‌ర్‌లో నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. ఈ వ్య‌వ‌ధిలో తెలుగు చిత్ర‌సీమ చూసింది అరకొర విజ‌యాలే. ఏప్రిల్ అయితే... డిజాస్ట‌ర్ల‌కు నెల‌వుగా మారింది. మే 13తో ఏపీలో ఎన్నిక‌ల హంగామా ముగుస్తుంది. ఆ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close