గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. దాంతో విపక్షాలు.. విమర్శలు గుప్పిస్తున్నాయి. అదే సమయంలో .. తెలంగాణలో కరోనా కంట్రోల్ తప్పిందన్న ఆందోళనలు పెరిగాయి. దీంతో గవర్నర్ తమిళిసై సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే అధికారవర్గాలకు కబురు పెట్టారు. చీఫ్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీని రాజ్‌భవన్‌కు రావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఇద్దరూ ముందే ఖరారైన కార్యక్రమాలు ఉన్నాయంటూ రాలేమని సమాచారం పంపారు. దీంతో సమావేశం జరగలేదు.

అయితే.. ప్రైవేటు ఆస్పత్రులతో మాత్రం తమిళసై వర్చువల్ సమావేశం నిర్వహించారు. కరోనా ఐసోలేషన్‌ సౌకర్యం ఉన్న ఆస్పత్రుల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ చికిత్స, పడకలు, పరీక్షలు, బిల్లులు, ప్రజల ఫిర్యాదులపై చర్చించారు. కరోనా విషయంలో తాము పట్టనట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. గవర్నర్ జోక్యం చేసుకోవడానికి కూడా సుముఖంగా లేదు. అందుకే.. పాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం వద్దని.. రాజ్‌భవన్ నుంచి సమీక్షల కోసం పిలుపు వచ్చినా.. తాము చెబితేనే వెళ్లాలన్న సందేశం.. ఉన్నతాధికారులకు అందినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ .. గవర్నర్‌ స్థానంలో ఎవరున్నా.. మంచి సంబంధాలను కోరుకుంటారు.

నరసింహన్ ఉన్నప్పుడు ఆయనను తనదైన శైలిలో మంచి చేసుకున్నారు. అయితే.. తమిళిసై గవర్నర్ గా వచ్చిన తర్వాత కేసీఆర్ రాజ్‌భవన్ వైపు వెళ్లడం తగ్గింది. అదే సమయంలో.. కరోనా విషయంలో తమిళసై యాక్టివ్ గా ఉండటం…సర్కార్ పెద్దలకు నచ్చలేదు. సీఎం కేసీఆర్ ఏ ఆస్పత్రిని సందర్శించకపోయినా.. తమిళిశై మాత్రం.. గాంధీ ఆస్పత్రిని పరిశీలించారు. అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు.. కేసీఆర్ సైలెంట్ గా ఉండి… గవర్నర్ కరోనా విషయంలో యాక్టివ్ అయితే ఇబ్బందికరమన్న ఉద్దేశంతో… గవర్నర్‌కు సహకరించవద్దని.. సంకేతాలను అధికారులకు పంపుతున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close