ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యం?

ప్ర‌భాస్ – నాగ అశ్విన్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ ఈ చిత్రాన్ని భారీ వ్య‌యంతో తెర‌కెక్కించ‌బోతోంది. దాదాపు 250 కోట్ల‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదో సైన్స్ ఫిక్ష‌న్ అని, జాన ప‌ద క‌థ అని ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మ‌రో ఆస‌క్తి క‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈచిత్రంలో ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ట‌. ఒకేసారి రెండు విభిన్న‌మైన కాలాల‌లో జ‌రిగే క‌థ ఇద‌ని, ఆ రెండు పాత్ర‌లూ పురాణ పురుషుల్ని పోలి ఉంటాయ‌ని, రెండు పాత్ర‌ల్లోనూ ప్ర‌భాస్ క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. ఈ రెండు క‌థ‌ల్ని, రెండు పాత్ర‌ల్నీ నాగ అశ్విన్ ఎలా క‌లిపాడ‌న్న‌ది ఆస‌క్తిగా ఉంటుంద‌ట‌. ఈ సినిమా కోసం భారీ సెట్స్ అవ‌స‌రం. వాటికి సంబంధించిన క‌స‌ర‌త్తులు ఇప్పుడు మొద‌ల‌య్యాయి. ఈనెలాఖ‌రున షూటింగ్ మొద‌లుకావ‌ల్సివుంది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాక‌పోవొచ్చు. ఈ చిత్రాన్ని ఇదే నెల‌లో లాంఛ‌నంగా మొద‌లెట్టి, అక్టోబ‌రులో కొన్ని స‌న్నివేశాల్ని తీసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయితే అది కూడా ప‌రిస్థితులు అనుకూలిస్తేనే. లేదంటే 2021 ప్ర‌ధ‌మార్థంలోనే ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close