ఇళ‌య‌రాజా వివాదం ముదురుతోంది

ఎందుకో… ఇళ‌య‌రాజా అప్పుడ‌ప్పుడూ వివాదాల్లో ఇరుక్కుంటుంటారు. అందులో ఆర్థిక ప‌రమైన‌వే ఎక్కువ‌. అప్ప‌ట్లో త‌న ఆప్తుడు, స‌న్నిహితుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంపై `రాయ‌ల్టీ` విష‌యంలో గొడ‌వ ప‌డ్డారు. ఆ వివాదం మెల్ల‌మెల్ల‌గా స‌ద్దుమ‌ణిగింది. ఇప్పుడు ఎల్వీ ప్ర‌సాద్ స్టూడియో విష‌యంలోనూ ఇలానే కోర్టు, పోలీసు స్టేష‌ను చుట్టూ తిరుగుతున్నాయి.

చెన్నైలోని ఎల్వీ ప్ర‌సాద్ స్టూడియోలో.. ఇళ‌య‌రాజాకు రికార్డింగ్ థియేట‌ర్ ఉంది. అయితే అది ఆయ‌న‌ది కాదు. స్టూడియోదే. అప్ప‌ట్లో ఎల్వీ ప్ర‌సాద్‌.. ఇళ‌య‌రాజాపై గౌర‌వంతో.. `ఈ స్టూడియో మీరు వాడుకోండి` అన్నారు. న‌ల‌భై ఏళ్లుగా ఇళ‌య‌రాజా అందులోనే కంపోజింగ్ చేస్తున్నారు. ఆ స్టూడియో ఇళ‌య‌రాజా ఆఫీసు, అడ్డాల మారింది. ఇప్పుడు ఎన్వీ ప్ర‌సాద్ మ‌న‌వ‌డు సాయి ప్ర‌సాద్ తో ఇళ‌య‌రాజా గొడ‌వ మొద‌లైంది. ఈ స్టూడియోని ఖాళీ చేయాల‌ని.. ఇళ‌య‌రాజాకు ఆయ‌న నోటీసులు జారీ చేశారు. ఇక్క‌డే ఇళ‌య‌రాజా గొడ‌వ‌కు దిగారు. `ఈ రికార్డింగ్ థియేట‌ర్ నాది… ఖాళీ చేసే ప్ర‌స‌క్తి లేదు` అంటూ.. కోర్టుకెళ్లారు.

నిజానికి ఈ స్టూడియోపై ఇళ‌య‌రాజాకు ఎలాంటి అధికారం లేదు. రికార్డింగ్ థియేట‌ర్ సైతం.. ఎన్వీ ప్ర‌సాద్ వార‌సుల పేరుపైనే ఉంది. దాన్ని ఇళ‌య‌రాజా కేవ‌లం వాడుకుంటున్నారంతే. న‌ల‌భై ఏళ్లుగా ఆయ‌న ఈ స్టూడియోకి ఎలాంటి రుసుమూ చెల్లించ‌డం లేద‌ని తెలుస్తోంది. కేవ‌లం ఇళ‌య‌రాజాపై గౌర‌వంతో.. అభిమానంతో.. రికార్డింగ్ స్టూడియో ఇస్తే.. ఇప్పుడు దాన్ని ఖాళీ చేసేది లేదంటూ ఇళ‌య‌రాజా గొడ‌వ ప‌డుతున్నారు. కోర్టులో కేసు వేశారు. ఎటు చూసినా ఈ కేసు నిల‌బ‌డ‌దు. ఇళ‌య‌రాజా ఖాళీ చేయాల్సిందే. కానీ… ఇళ‌య‌రాజా మాత్రం మొండి ప‌ట్టుద‌ల‌కు పోతున్నారు. త‌న‌పై ఎల్వీ ప్ర‌సాద్ వార‌సులు దాడి చేశార‌ని, బ‌ల‌వంతంగా స్టూడియోని ఖాళీ చేయిస్తున్నార‌ని, స్టూడియోలోని సామాగ్రిని సైతం ధ్వంసం చేస్తున్నార‌ని ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

స్టూడియోపై ఇళ‌య‌రాజాకు ఎలాంటి హ‌క్కూ లేద‌ని, ఆయ‌న గౌర‌వంగా ఖాళీ చేస్తే హుందాగా ఉండేద‌ని, ఇప్పుడు అన‌వ‌స‌రంగా ఈ కేసు కోర్టు వ‌ర‌కూ వెళ్లింద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఈ గొడ‌వ ఎప్పుడు స‌ద్దుమ‌ణుగుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close