మంటల్లో బెజవాడ కోవిడ్ ఆస్పత్రి..! రోగుల ప్రాణాలు పణం..!

మొన్న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగి. రోగులు మరణించిన విషయం కలకలం రేపింది. ఇప్పుడు అలాంటి ఘటనే ఏపీలో జరిగింది. విజయవాడలో.. కోవిడ్ చికిత్స ఆస్పత్రిగా వినియోగిస్తున్న స్వర్ణా ప్యాలెస్ హోటల్లో ఈ ఘటన జరిగింది. మంటలు ఎలా చెలరేగాయో కానీ ఒక్క సారిగా పొగ చుట్టుముట్టడంతో.. అందులో ఉన్న వారు వణికిపోయారు. శ్వాస సమస్యలతోనే అక్కడ చికిత్స పొందుతున్నరోగులు.. ఇబ్బంది పడ్డారు. నలుగురు వరకూ చనిపోయారని.. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

విజయవాడలో స్వర్ణా ప్యాలెస్ హోటల్ అంటే తెలియని వారుండరు. లాక్ డౌన్ కారణంగా పూర్తిగా మూసివేశారు. అయితే.. ఇటీవల కరోనా చికిత్స కోసం.. రమేష్ ఆస్పత్రి దాన్ని లీజుకు తీసుకుంది. అనుమతులు తీసుకుని కోవిడ్ ఆస్పత్రిగా మార్చింది. అందులో… నలభై నుంచి 50 మంది వరకూ చికిత్స పొందుతున్నట్లుగా చెబుతున్నారు. ఆస్పత్రిలో ఓ ఇరవై మంది వరకూ.. సిబ్బంది ఉంటారని అంచనా వేస్తున్నారు. అందరూ.. నిద్రపోతున్న సమయంలో మంటలు చెలరేగడంతో… పూర్తిగా పొగ చుట్టుముట్టిన తర్వాతే అగ్నిప్రమాదం గురించి తెలిసింది.

పొగ వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ… గదుల కిటికీల్లోంచి రోగులు.. హాహాకారాలు చేశారు. కాసేపటికి.. అంబులెన్స్‌లు వచ్చాయి. ఉన్న వారందర్నీ… ఇతర ఆస్పత్రులకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే.. మామూలుగా.. కాస్త సీరియస్‌గా ఉన్న వారినే అక్కడ చేర్చి వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడు పొగబారిన పడటంతో.. వారిని కాపాడటానికి మరింత చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అసలు స్వర్ణా ప్యాలెస్‌లో ఎంత మంది కరోనా రోగులు ఉన్నారు..? ఎంత మంది సిబ్బంది ఉన్నారు.. ఆరోగ్య పరిస్థితి ఏమిటి అన్నదానిపై పూర్తి వివరాలను అధికారులు చెప్పడం లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close