కట్‌ చేసిన జీతాలు,పెన్షన్లను 12 శాతం వడ్డీతో చెల్లించాల్సిందే..!

కరోనా పేరు చెప్పి రెండు నెలల పాటు సగం సగం జీతాలే ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జీతాలు, పెన్షన్‌ బకాయిలు చెల్లించాలని ఆదేశించింది.మార్చి, ఏప్రిల్ నెలల్లో బకాయిపడిన 50శాతం జీతాలు, పెన్షన్లను.. 12శాతం వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసింది. కరోనా, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా 50 శాతం మాత్రమే .. జీతాల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టి వేసింది. విశాఖకు చెందిన రిటైర్డ్ జడ్జి కామేశ్వరి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం కరోనా లాక్ డౌన్ ప్రకటించిన నెలలో మొత్తం జీతాలు ఇవ్వడానికి బిల్లులు సిద్ధం చేసుకున్నారు.

అయితే అప్పుడే కేసీఆర్ సగం జీతాలే ఇవ్వాలని నిర్ణయించడంతో జగన్ కూడా మనసు మార్చుకున్నారు. రెండు నెలల పాటు సగం సగం జీతాలే ఇచ్చారు. పెన్షన్లు కూడా సగమే ఇచ్చారు. అయితే.. అప్పుడే.. పెన్షనర్లు కోర్టును ఆశ్రయించారు. ఆపడానికి అవకాశం లేదని న్యాయనిపుణులు చెప్పడంతో.. ఆ నెల నుంచి మొత్తం జీతాలు, పెన్షన్లు ఇస్తున్నట్లుగా కోర్టుకు తెలిపారు. కానీ రెండు నెలల బకాయిల గురించి మాత్రం చెప్పలేదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ప్రాతిపదిక ఏమిటో తెలియని పరిస్థితి.

దీంతో పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులు పడ్డారు. కొంత మంది కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు జీతాలు చెల్లించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. రెండు నెలలకు కలిపి ఉద్యోగులకు దాదాపుగా ఐదు వేల కోట్ల వరకూ చెల్లించాల్సి రావొచ్చని అంచనా. అయితే.. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ ఆదేశాలను ఎంత మేర పట్టించుకుంటుందన్నది చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close