పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన కేసులు కూడా ఎత్తేస్తారా..!?

ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు రాను రాను వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే దళితులపై పోలీసుల అరాచకాలు హైలెట్ అవుతూండగా.. తాజాగా..పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి.. పోలీసుల్ని కొట్టి విధ్వంసం సృష్టించిన కేసులను కూడా… ఎత్తేయాలని నిర్ణయించుకోవడం కలకలం రేపుతోంది. 2018 మే 15వ తేదీన గుంటూరులో విధ్వంసం జరిగింది. ఓ బాలికపై అత్యాచారం ఘటనలో పోలీసులు సరిగ్గా స్పందించలేదంటూ.. అల్లరి మూక పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగింది. ఒక్కసారిగా అల్లర్లు చెలరేగడానికి సంఘ విద్రోహ శక్తులే కారణమని అప్పట్లో పోలీసు శాఖ నివేదికలు ఇచ్చింది. ఆందోళనకారుల్లో చొరబడిన కొందరు ప్రణాళిక ప్రకారం విధ్వంసానికి దిగినట్లు నిర్ధారించారు. పలువురిపై కేసులు నమోదు చేశారు.

ఇప్పుడు ఆ కేసులన్నింటినీ ఉపసంహరిస్తూ… హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మొత్తం 6 కేసులను ఉపసహరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏవో రాజకీయ ఆందోళనలాంటి చిన్న చిన్న కేసులు ఎత్తివేయడం ఇప్పటి వరకూ చూసి ఉంటాం కానీ.. ఇప్పుడు.. సంఘ విద్రోహశక్తులుగా గతంలో.. పోలీసులే నిర్ధారించి.. అరెస్టులు చేసిన.. వారి కేసులు మాఫీ చేయడం చర్చనీయాంశం అవుతోంది. అదీ కూడా.. శాంతిభద్రతల్ని కాపాడాల్సిన పోలీసులపైనే దాడి చేసిన వారి కేసుల్ని విచారణ చేసి.. కోర్టులో శిక్ష పడేలా చేయాల్సిన కేసుల్ని రద్దు చేయడం… ఆశ్చర్యకరంగా మారింది.

కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకానేక కేసుల్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంతోంది. కొన్ని హత్య కేసుల్ని కూడా ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. కాపు రిజర్వేషన్ ఉద్యమం పేరుతో… రైళ్లు తగులబెట్టి… పోలీస్ స్టేషన్‌లో విధ్వంసం సృష్టించి.. పోలీసులపై విరుచుకుపడిన వారి కేసులనూ ప్రభుత్వం ఎత్తివేసింది. రైళ్లు తగులబెట్టిన కేసును రైల్వే శాఖ మాత్రం ఎత్తివేయలేదు. గతంలో ఈ విధ్వంసాలకు వైసీపీ నేతలు కుట్ర పన్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక… ఆ ఘటనల్లో నిందితులందరిపై కేసులు ఎత్తివేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close