మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భారీ అగ్నిప్రమాదం

నిన్న రాత్రి ముంబైలో గిర్ గావ్-చౌపాతీ బీచ్ వద్ద మేక్ ఇన్ ఇండియా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నపుడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న వేదిక క్రింద మంటలు చెలరేగడంతో క్షణాలలో వేదిక పూర్తిగా దగ్ధమయిపోయింది. దానికి కొన్ని నిమిషాల ముందే బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అదే వేదికపై చిన్న కవితను వినిపించారు. ఆ తరువాత 8.22 నిమిషాలకు బాలీవుడ్ నటి పూజా సావంత్ బృందం లావణి నృత్య కార్యక్రమం చేస్తుండగా వేదిక క్రింద మంటలు అంటుకొన్నాయి. అది గమనించిన సభ నిర్వాహకులు వారిని తక్షణమే వేదిక మీద నుండి క్రిందకు దింపివేశారు. వారు వేదిక దిగిన కొన్ని క్షణాలలోనే మంటలలో వేదిక మొత్తం తగులబడిపోయింది.

దగ్గరలోనే ఉన్న అగ్నిమాపక బృందాలు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియదు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న వేదిక క్రింద అమర్చిన విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాలు చౌపాతీ బీచ్ ఒడ్డున నిర్వహిస్తుండటంతో అక్కడ వీస్తున్న బలమయిన గాలికి మంటలు చాలా వేగంగా వేదికపైకి వ్యాపించాయి.

ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రులు, శివసేన అధినేత ఉద్దవ్ టాక్రే, అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు, 60 దేశాల నుండి ప్రతినిధులు, సుమారు 10,000కి పైగా ప్రజలు వచ్చేరు. మంటలు అంటుకోగానే అప్రమత్తమయిన పోలీసులు లోపల ఉన్నవారిని అందరినీ జాగ్రత్తగా బయటకి తరలించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా వారిని బయటకు తరలించడంలో సహాయపడ్డారు. ఆ సభా వేదికకి ఐదు ద్వారాలు ఏర్పాటు చేసి ఉండటంతో అందరినీ వేగంగా బయటకి తరలించడం సాధ్యమయింది. ఇంత భారీ అగ్నిప్రమాదంలో ఏ ఒక్కరు కూడా గాయపడకుండా తప్పించుకోగలిగారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close