సెట్స్‌లో అడుగుపెడుతున్న సందీప్‌కిష‌న్‌

క‌రోనా వ‌ల్ల షూటింగుల‌న్నీ బంద‌యిపోయాయి. కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు షూటింగుల‌కు అనుమ‌తులు ఇచ్చినా – హీరోలు ధైర్యం చేయ‌ట్లేదు. ఇప్పుడిప్పుడే యువ హీరోలు షూటింగుల కోసం ముందుకొస్తున్నారు. తాజాగా సందీప్ కిష‌న్ షూటింగ్‌కి రెడీ అయ్యాడు. సందీప్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం `ఏ 1 ఎక్స్‌ప్రెస్`. ఏఏఏ ఆర్ట్స్‌, పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మంగ‌ళ‌వారం నుంచి హైద‌రాబాద్ లో షూటింగ్ మొదలు పెట్ట‌నున్నారు. సందీప్ కిష‌న్‌పై కొన్ని ముఖ్య‌మైన సన్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. “బ్యాక్ టూ సెట్స్ ఫ్ర‌మ్ టుమారో` అంటూ సందీప్ కిషన్ ఓ ట్వీట్ చేశాడు. క్రీడా నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో దేహ ధారుడ్యంపై దృష్టి పెట్టాడు సందీప్‌. ఈ విరామాన్ని స‌రిగ్గా వాడుకుంటూ కండ‌లు పెంచి, ఈ పాత్ర కోసం పూర్తి స్థాయిలో స‌న్న‌ద్ధ‌మ‌య్యాడు. లావ‌ణ్య త్రిపాఠీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ పర్సంటేజీ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకతేనా ?

ఏపీలో పోలింగ్ శాతం గత ఎన్నికల కన్నా రెండు శాతం పెరిగింది. ఈ రెండు శాతం చిన్నది కాదు. ఎందుకంటే హై పోలింగ్ లో ఎంత చిన్న మొత్తం పెరిగినా...

రేవంత్‌కు రుణమాఫీ అంత వీజీ కాదు !

రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు రేవంత్ డెడ్ లైన్ పెట్టుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ చేయలేకపోయింది. హామీని పూర్తిగా అమలు చేయలేకపోయింది. ఇప్పుడు రెండు...

అదే వైసీపీ కొంపముంచనుందా..?

ఏపీలో అధికారపీఠం ఎవరు కైవసం చేసుకుంటారన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎవరిని కదిలించినా ఫలితాల గురించే ముచ్చట. పోలింగ్ శాతం భారీగా పెరగడంతో కూటమిదే విజయమని...

‘మిరల్’ రివ్యూ: చీకటి నాటకం

ఈ సమ్మర్ లో సరైన సినిమా పడలేదు. అక్యుపెన్సీ లేకపోవడంతో సింగిల్ స్క్రీన్స్ రెండు వారాలు క్లోజ్ చేస్తున్నట్లు యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈ వారం రావాల్సిన సినిమాలు వెనక్కి వెళ్ళాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close