శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో మళ్లీ మంటలు…కాకపోతే మాక్‌డ్రిల్‌ట..!

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో మరోసారి పేలుడు జరిగింది. కరెంట్ కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో మంటలు చెలరేగాయి. భారీ శబ్ధాలతో మంటలు ఎగసిపడటంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలో పన్నెండు రోజుల కిందటే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది చనిపోయారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై ఇప్పటికీ దర్యాప్తులో తేలలేదు. ఊహంచని విధంగా జరిగిన ప్రమాదంపై ప్రభుత్వానికి విచారణకు ఆదేశించింది.

అప్పటి నుంచి ప్లాంట్ పని చేయడం లేదు. ప్రస్తుతం ప్లాంట్‌ను పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో మంటలు రేగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. అయితే .. విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు మాత్రం… అది అగ్నిప్రమాదం కాదని తల్చేశారు. సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉన్నారో తేల్చుకునేందుకు మాక్ డ్రిల్ నిర్వహించామని చెప్పుకొచ్చారు. మాక్ డ్రిల్ నిర్వహణలో ప్లాంట్ లోపల మంటలు వచ్చేలా ఎలాంటి ఏర్పాట్లు చేయరు.

ఏదైనా మాక్ డ్రిల్ చేయాలనుకుంటే.. పొగల వరకే పరిమితం అవుతారు. అసలే సున్నితమైన ప్రాంతం.. అందులో మాక్ డ్రిల్ పేరుతో… మంటలు రేపే ప్రయత్నం చేయరని అంటున్నారు. ఇప్పటికే ప్లాంట్‌లో అగ్నిప్రమాదంలో తీవ్ర విమర్శలు వస్తున్న సమయంలో.. ప్రమాద తీవ్రతను తగ్గించి చూపేందుకు…మాక్ డ్రిల్ అని అంటున్నారన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ద్వేషం స్థాయికి వ్యతిరేకత – జగన్ చేసుకున్నదే!

ఏ ప్రభుత్వంపైనైనా వ్యతిరేకత ఉంటుంది. అది సహజం. కానీ ద్వేషంగా మారకూడదు. మారకుండా చూసుకోవాల్సింది పాలకుడే. కానీ పాలకుడి వికృత మనస్థత్వం కారణంగా ప్రతి ఒక్కరిని తూలనాడి.. తన ఈగో ...

పల్నాడులో దెబ్బకు దెబ్బ – వైసీపీ ఊహించనిదే !

పల్నాడులో పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి జరిగిన పరిణామాలు సంచలనంగా మారాయి. ఉదయం కాస్త ప్రశాంతంగా పోలింగ్ జరిగినా.. తమకు తేడా కొడుతుందని అంచనాకు రావడంతో మధ్యాహ్నం నుంచివైసీపీ నేతలు...

టాలీవుడ్‌… ఇక ఊపిరి పీల్చుకో!

ఈ వేస‌విలో చిత్ర‌సీమ ఎదుర్కొన్న గండాల్లో ఏపీ ఎన్నిక‌లు ఒక‌టి. ఇది వ‌ర‌కెప్పుడూ లేనంత‌గా ఏపీ రాజ‌కీయాలు వేడెక్క‌డంతో... ప్ర‌జ‌ల దృష్టంతా అటువైపే ఉంది. కొత్త సినిమా క‌బుర్ల‌ని చెప్పుకోవ‌డానీ, థియేట‌ర్ల వ‌ర‌కూ...

తిట్లు,విధ్వంసం, రౌడీయిజానికా పాజిటివ్ ఓటు సజ్జలా !?

పాజిటివ్ ఓటు వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి పోలింగ్ అయిపోగానే గోళ్లు గిల్లుకుంటూ మీడియాకు చెప్పారు. వైసీపీకి మద్దతు పలికేందుకు అంత పరుగులు పెట్టి ఓటర్లు రావడానికి అవసరమయ్యే ఒక్క పాజిటివ్ కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close