అమరావతిపై రిఫరెండంగా నర్సాపురం ఉపఎన్నిక..!?

అమరావతి విషయంలో అధికార, ప్రతిపక్షాలు రాజకీయంగా ఓ అవగాహనకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజాభిప్రాయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎన్నికలకు ముందు మూడు రాజధానులు అని చెప్పలేదు కాబట్టి.. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని అంటోంది. ఈ విషయంలో వైసీపీ గట్టిగా ఏమీ చెప్పలేకపోతోంది. అయితే… ఇప్పుడు మరో ఆప్షన్ ఆ పార్టీ ముందుకు వచ్చింది. అదే నర్సాపురం లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక. అమరావతి కోసం రిఫరెండంగా.. ఉపఎన్నికను చూస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటిస్తే.. తాను రాజీనామా చేస్తానని రఘురామకృష్ణరాజు బహిరంగ సవాల్ విసిరారు.

నర్సాపురం ఎంపీపై వైసీపీకి పీకల మీద దాకా కోపం ఉంది. ఆయన ప్రతిపక్ష పార్టీల నేతలను మించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దాంతో ఆయన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌ను తరచూ వినిపిస్తున్నారు. ఇలాంటి డిమాండ్ వినిపించినప్పుడల్లా రఘురామకృష్ణరాజు ఫైర్ అవుతున్నారు. తన ఇమేజ్‌తోనే గెలిచానని.. తన వల్ల కొంత మంది ఎమ్మెల్యేలు గెలిచారని.. తనతో పాటు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారా అని అడుగుతున్నారు. అయితే ఈ సారి మంత్రి బాలినేని విసిరిన సవాల్‌కు.. రఘురామకృష్ణరాజు భిన్నంగా బదులిచ్చారు. పార్టీకి చెడ్డపేరు రాకుండా ఉండేందుకే.. తాను అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్నానన్నారు. అమరావతిపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి తాను రాజీనామా చేస్తానని నర్సాపురం ఉపఎన్నికను .. రిఫరెండంగా జగన్‌తో ప్రకటింప చేస్తారా అని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసినట్లుగా ప్రభుత్వం మొత్తం రద్దు చేస్తే ఇబ్బంది అవుతుంది. కానీ రఘురామకృష్ణరాజు సవాల్ ప్రకారం అయితే.. ఒక్క నర్సాపురం నియోజకవర్గంతోనే.. రిఫరెండం పూర్తి చేయవచ్చు. అమరావతిపై మాట మార్చారనే విమర్శలకు.. ప్రజా మద్దతు లేదనే విమర్శలకు కౌంటర్ ఇచ్చినట్లవుతుంది. అయితే.. ఈ విషయంలో వైసీపీ స్పందన ఏమిటో తెలియడం లేదు. ఒక వేళ జగన్.. నిజంగానే.. రఘురామకృష్ణరాజు సవాల్‌కు స్పందిస్తే.. అమరావతి వివాదానికి ఓ లాజికల్ కంక్లూజన్‌ లభించే అవకాశం ఉంటుంది. మరేం చేస్తారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close