వైఎస్ఆర్, జగన్ పాలనకు ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా : కొండా సురేఖ

రాజన్న పాలన తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉంటారు. తీసుకొచ్చేశారని వైసీపీ నేతలు అప్పుడప్పుడు సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కానీ నిఖార్సైన ఫీడ్ బ్యాక్ మాత్రం అప్పుడప్పుడు.. ఆత్మీయులైన వారి దగ్గర్నుంచే బయటకు వస్తూ ఉంటుంది. అలాంటి ఫీడ్ బ్యాక్.. కొండా సురేఖ వద్ద నుంచి ఏపీ ప్రభుత్వానికి అందింది. అదేమిటంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు.. జగన్మోహన్ రెడ్డి పాలనకు.. భూమికి.. ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని. ఓ సారి గెలిచిన తర్వాత వైఎస్ఆర్ ఆందర్నీ సమానంగా చూస్తారని.. కానీ జగన్ మాత్రం.. కక్షలు తీర్చుకోవడానికి అధికారాన్ని ఉపయోగిస్తున్నారనేది కొండా సురేఖ విశ్లేషణ. అందరూ ఇదే అంటున్నారు కానీ.. కొండా సురేఖ చెప్పడం మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు వీర విధేయులు కొండా దంపతులు.

తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా కొండా దంపతులు జగన్మోహన్ రెడ్డిని విడిచి పెట్టలేదు. ఆ ఊపులో ఓడిపోతామని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామా చేసి పరకాల ఉపఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో తీవ్రంగా పోరాడారు. చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా ఆ తర్వాత జగన్ ను వదిలి పెట్టలేదు. కానీ ఆ తర్వాత జగన్ పట్టించుకోకపోవడంతో తమ దారి తాము చూసుకున్నారు. అప్పట్నుంచి వైఎస్ తో పోల్చి.. జగన్‌కు అసలు పోలికలే లేవని చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం పాలన విషయంలోనూ..,వైఎస్‌తో అసలు జగన్‌కే పోలికే లేదని… చెబుతున్నారు. కేసీఆర్ డబ్బులతోనే జగన్ గెలిచారని కొండా సురేఖ అంటున్నారు. వెయ్యి కోట్లు పంపించారనేది ప్రచారమే కానీ.. ఎంత పంపారనేది కాదు.. ఖచ్చితంగా పంపించారని మాత్రం ఆమె అంటున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే కాదు.. ఎవరు అధికారంలోకి వచ్చినా కక్ష సాధింపుల కోసం అధికారాన్ని వాడుకునే ప్రయత్నం చేయరు. చేసినా అది చాలా పరిమితంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఎకైక అజెండా అధికారం అందింది కాబట్టి ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం అన్నట్లుగా మారిపోయింది. ఓటు బ్యాంక్‌ను సంతృప్తి పరచడానికి ప్రజలకు పథకాల రూపంలో ఎంతో కొంత నగదు బదిలీ చేయడం.. ఆ తర్వాత ఇష్టం లేని వారిపై దండయాత్ర చేయడం.. కామన్‌గా మారిపోయింది. ఈ క్రమంలో చట్టాలను ఉల్లంఘిస్తున్నారని కోర్టుల్లో మొట్టికాయలు పడుతున్నా… వెనక్కి తగ్గని పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ హయాంలో ఎన్నికల వరకే రాజకీయాలు.. మిగతా రోజుల్లో అందర్నీ సమానంగానే చూసేవారని కొండు సురేఖ లాంటి వాళ్లు చెబుతూ ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ రాజీనామా…? త్వరలో కొత్త బాస్?

లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పీసీసీ అద్యక్షుడి నియామకం ఉంటుందని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడంతో పార్టీ ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరులో లోకల్ బాడీ...

ఈసీపై నిందలేయడానికే ప్లాన్డ్ హింస !

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతర హింస దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కువగా హింస జరుగుతుంది. అది రెండు, మూడు రోజుల్లో సద్దుమణిగిపోతుంది. కానీ ...

క్యాడర్ హోప్స్ పెట్టుకోవద్దని హింట్స్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ క్యాడర్ ను ఆర్తికంగా చితికిపోకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. బెట్టింగులు కట్టి నష్టపోకుండా ఉండేందుకు ఆయన మెల్లగా హింట్స్ ఇస్తున్నారు. దాదాపుగా ప్రతి రోజూ ప్రెస్ మీట్లు పెట్టి...

బరి తెగించిన వైసీపీ ఎమ్మెల్యే…యువతితో అసభ్య ప్రవర్తన..!!

ఎమ్మెల్యేగా మహిళల సంరక్షణకు తోడ్పాటు అందించాల్సిన వైసీపీ ఎమ్మెల్యే బరితెగించాడు. ఇంట్లో ఎవరూ లేరని ఓ యువతిపై లైంగిక దాడికి యత్నించిన వీడియో ఏపీ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. కోడుమూరు వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close